బుధవారం నాడు అయోధ్య రామాలయంలో( Ayodhya Ram Temple ) ప్రతిష్టమించనున్న రామ్ లల్లా విగ్రహం( Statue of Ram Lalla ) ఆలయ ప్రాంగణానికి చేరుకుంది.అయితే బుధవారం నాడు విగ్రహాన్ని ట్రక్కులో తీసుకువచ్చారు.
విగ్రహం రాగానే జైశ్రీరామ్ నినాదంతో ప్రాంగణం దద్దరిల్లింది.అయితే క్రేన్ సహాయంతో విగ్రహాన్ని గుడిలోకి చేర్చారు.
ఇక ఈ రోజు ఆలయ గర్భగుడిలోకి విగ్రహాన్ని తీసుకొస్తారు.కాబట్టి వెండితో చేసిన ఒక రామ్ లల్లా విగ్రహాన్ని ఆలయ ప్రాంగణంలో ఈరోజు ఊరేగించనున్నారు.
పూజారి నెత్తిపై కలశాన్ని పెట్టుకొని ముందు నడుస్తుండగా పూలతో అలంకరించిన పల్లకిలో ఈ వెండి విగ్రహాన్ని ఊరేగించారు.
![Telugu Anil Mishra, Bhakti, Devotional, Sripadmanabha-Latest News - Telugu Telugu Anil Mishra, Bhakti, Devotional, Sripadmanabha-Latest News - Telugu](https://telugustop.com/wp-content/uploads/2024/01/Ram-Lalla-who-reached-Ayodhya-entered-the-sanctum-sanctorum-todayb.jpg)
అంతకుముందు ప్రాణ ప్రతిష్ట ఉత్సవాలలో భాగంగా అయోధ్యలో కలశ పూజ ఘనంగా నిర్వహించడం జరిగింది.శ్రీ రామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ సభ్యుడు అయిన అనిల్ మిశ్రా ( Anil Mishra )దంపతులు, సరియునది ఒడ్డున దీనిని భక్తి శ్రద్ధలతో చేపట్టారు.ఆ తర్వాత కళశాలలో సరయు నది నీటిని రామ మందిరానికి తీసుకొని వెళ్లారు.
ఇక నేడు అయోధ్య రామ మందిరం గర్భగుడిలోకి బాల రాముడు విగ్రహాన్ని తీసుకువస్తారు.దీంతో తీర్థ క్షేత్రం ట్రస్టు సభ్యులతో పాటు నిర్మూహి అకాడకు చెందిన మహంత్ దినేంద్రదాస్ ( Mahant Dinendradas )పూజారి సునీల్ దాస్ విగ్రహాన్ని ప్రతిష్టించే ప్రదేశం దగ్గర పూజలు నిర్వహించి, హారతి ఇచ్చారు.
![Telugu Anil Mishra, Bhakti, Devotional, Sripadmanabha-Latest News - Telugu Telugu Anil Mishra, Bhakti, Devotional, Sripadmanabha-Latest News - Telugu](https://telugustop.com/wp-content/uploads/2024/01/Ram-Lalla-who-reached-Ayodhya-entered-the-sanctum-sanctorum-todayd.jpg)
ఇక కేరళలోని శ్రీ పద్మనాభ స్వామి దేవాలయం ( Sri Padmanabha Swamy Temple )అయోధ్యరానికి సంప్రదాయ ఆచార విల్లు’ఓన విల్లును’ బహుకరించనుంది.ఇక ఈనెల 18వ తేదీన అయోధ్యలో దీనిని ఆలయ నిర్వాహకులు అందజేస్తారు.అయితే ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ తన కుటుంబంతో సహా వెళ్లి అయోధ్య రాముడుని దర్శించుకుంటానని బుధవారం నాడు తెలిపారు.ఈ విధంగా చాలామంది వీఐపీలు రాముడి ప్రాణ ప్రతిష్ట కోసం పది రోజులు ముందుగానే అక్కడికి చేరుకున్నారు.
మరి ముఖ్యంగా మన దేశ ప్రధానమంత్రి మోడీ కూడా ప్రాణ ప్రతిష్టకు 11 రోజుల ముందు నుండే అయోధ్యలో ఉంటున్నారు.
LATEST NEWS - TELUGU