హత్కోటిలో కొలువైన హ‌తేశ్వ‌రి మాత‌...ఈ ఆల‌యం గొప్ప‌ద‌నం తెలిస్తే...

హత్కోటి( Hatkoti temple ) హిమాచల్ ప్రదేశ్‌లోని పబ్బర్ నది ఒడ్డున ఉన్న ఒక పురాతన గ్రామం.ఈ గ్రామంలో హతేశ్వరి మాత ఆలయం ఉంది.

 Hatkoti Temple Know The Importance And History , Hatkoti Temple ,mahishasura ,-TeluguStop.com

ఆలయ గర్భగుడిలో మహిషాసురుడిని సంహరిస్తున్న హతేశ్వరి మాత విగ్రహం ఉంది.విగ్రహం ఎత్తు 1.2 మీటర్లు.ఈ విగ్రహం 7వ శతాబ్దానికి చెందినది.

విగ్రహానికి 8 చేతులు ఉన్నాయి.అమ్మవారి ఎడమ చేతిలో మహిషాసురు( Mahishasura )ని తల ఉంటుంది.

అమ్మవారి కుడి కాలు భూగర్భంలో ఉందని చెబుతారు.అమ్మ‌వారి కుడి చేతిలో చక్రం ఎడమ చేతిలో రక్తబీజం ఉంది.

గర్భగుడిలోని విగ్రహానికి ఇరువైపులా 7వ, 8వ శతాబ్దానికి చెందిన అప్రకటిత శాసనాలు ఉన్నాయి.సింహాసనం వెనుక నవదుర్గ విగ్ర‌హం ఉంది.

దాని కింద వీణాధారి శివుడు మరియు ఇంద్రుడు నేతృత్వంలోని ఇతర దేవతలు ఉన్నారు.రెండు వైపులా గుర్రంతో కూడిన‌ హయగ్రీవుడు ఏనుగు అయిన ఐరావతం ఉన్నాయి.

ఇదే కాకుండా గర్భగుడిలో అమ్మవారి పక్కన పరశురాముని రాగి కలశం క‌నిపిస్తుంది.

Telugu Hateshwari Mata, Hatkoti, Hatkoti Temple, Mahishasura, Pandavas, Shimla-L

pg

సింహాసనానికి ఎడమ మరియు కుడి వైపున గంగా మరియు యమున రూపాలు చిత్రీకరించారు.ఈ ఆలయంలో దేవత రాతి విగ్రహం పిడుగును పట్టుకున్నట్లు క‌నిపిస్తుంది.విగ్రహపు పెదవులకు రాగి మరియు కళ్ళు వెండితో రూపొందించారు.

ఈ ఆలయంలో శివలింగం ఉంది.దాని చుట్టూ అద్భుతం నిర్మాణం ఉంది.

దీని పైకప్పుపై దేవుళ్లు, దేవతల విగ్రహాలు చెక్కారు.హత్కోటి దేవాలయం సిమ్లా(Shimla ) నుండి 130 కి.మీ మరియు రోహ్రు నుండి 14 కి.మీ దూరంలో ఉంది.హతేశ్వరి దేవాలయం 9వ-10వ శతాబ్దంలో నిర్మిత‌మ‌య్యింద‌ని నమ్ముతారు.ఈ ఆలయం పిరమిడ్ రూపంలో నిర్మిత‌మ‌య్యింది.ఆల‌యంలో పాలరాతి అమల్కా బంగారు కలశం కన‌పిస్తాయి.

Telugu Hateshwari Mata, Hatkoti, Hatkoti Temple, Mahishasura, Pandavas, Shimla-L

pg

ఈ కలశాన్ని ఆలయ సముదాయం ప్రవేశ ద్వారం వద్ద ఉంచారు.ఆలయం చుట్టూ చెక్కతో, రాతితో గోడ నిర్మించారు.ఈ ఆలయ కథ మహాభారత కాలం నాటి పాండవులతో ముడిప‌డివుంది.

హతేశ్వరి మాత ఆలయ సముదాయంలో 5 చిన్న ఆలయాలు ఉన్నాయి.ఈ చిన్న దేవాలయాలలో శివుని విగ్రహాలు ఉన్నాయి.

ఈ ఆలయాలను పాండవులు( Pandavas ) నిర్మించారని స్థానికులు నమ్ముతారు.హతేశ్వరి మాత గర్భగుడి ప్రవేశ ద్వారం దగ్గర, గొలుసుతో కట్టబడిన భారీ రాగి పాత్ర ఉంది.

దీని గురించి ఒక ప్రసిద్ధ కథనం ఉంది.ఆలయ ప్రాంగణంలో ఓ పూజారి నిద్రిస్తుండగా ఉరుము శబ్దం రావడంతో మెలకువ వచ్చిందని చెబుతారు.

బయట జోరున వర్షం కురుస్తోంది.బయటకు వచ్చి చూసేసరికి నదిలో రెండు పెద్ద రాగి పాత్రలు కొట్టుకుపోతున్నాయి.

పూజారి పాత్రలు తీసి అమ్మవారికి సమర్పించాడు.వర్షం కురసిన‌ప్పుడు నదిలో ఒక‌పాత్ర కొట్టుకుపోయిందని చెబుతారు.

దీని తరువాత రెండవ పాత్రను గొలుసుతో కట్టివేశారంటారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube