తమిళ స్టార్ హీరో ధనుష్ తన 18 ఏళ్ల వైవాహిక జీవితంకు ఫుల్ స్టాప్ పెడుతున్నట్లుగా ప్రకటించి ప్రతి ఒక్కరికి షాక్ ఇచ్చాడు.రజినీకాంత్ అల్లుడిగా ఆయనకు మంచి హోదా దక్కింది.
కాని ఇప్పుడు ఆయన భార్య తో విడి పోవడం అందరికి ఆశ్చర్యంగా ఉంది.తెలుగు లో మెగాస్టార్ అయిన చిరంజీవి కూతురు శ్రీజ కూడా తన భర్త నుండి విడి పోయినట్లుగా వార్తలు వస్తున్నాయి.
ఆ విషయంలో క్లారిటీ అయితే రాలేదు కాని ఆమె తన ఇన్ స్టా నేమ్ ను మార్చడం ద్వారా విడాకుల విషయాన్ని అధికారికంగా ప్రకటించింది.విడాకులు తీసుకున్నట్లుగా ప్రకటించిన ధనుష్ మరియు ఐశ్వర్య ల విషయమై వివాదాల దర్శకుడు రామ్ గోపాల్ వర్మ స్పందించాడు.
పెళ్లి అనే ఒక బంధంను అస్సలు నమ్మని రామ్ గోపాల్ వర్మ ఏ ఒక్కరు విడాకులు తీసుకున్నా కూడా వెంటనే స్పందిస్తూ ఉంటాడు.
ఇలా స్టార్స్ ప్రముఖులు విడాకులు తీసుకోవడం వల్ల మీడియాలో మంచి పబ్లిసిటీ వస్తుంది.తద్వారా విడాకుల గురించి అందరికి తెలిసి పెళ్లి అంటేనే కోపం అన్నట్లుగా ప్రతి ఒక్కరు మారుతారు అంటూ విభిన్నమైన ఆలోచనను రామ్ గోపాల్ వర్మ వ్యక్తం చేశాడు.రామ్ గోపాల్ వర్మ పెళ్లి చేసుకుని ఒక కూతురు అయిన తర్వాత భార్య నుండి విడిపోయిన విషయం తెల్సిందే.
ఇప్పుడు భార్య పిల్లలు అనే బంధాలు లేకుండా ఆయన ముందుకు వెళ్తున్నాడు.ఇలాంటి సమయంలో ఇతరులు ఎవరు విడాకులు తీసుకున్నా కూడా వారిని అభినందిస్తూ.వారి యొక్క విడాకులను సెలబ్రేట్ చేసుకోవాలంటూ కామెంట్స్ చేస్తూ ఉంటాడు.మొత్తానికి రామ్ గోపాల్ వర్మ సూచించినట్లుగా ఇంకా ఎంత మంది విడాకులు తీసుకుంటారో అనే ఆందోళనను అభిమానులు వ్యక్తం చేస్తున్నారు.
వైవాహిక బంధం బలహీనంగా ఉన్నప్పుడు విడాకులు తీసుకోవడం మంచిదే కాని దాని గురించి హడావుడి లేకుండా ఉంటే ఉత్తమం అనేది కొందరి వాదన.