మీరా చోప్రాపై బ్యాడ్ కామెంట్స్ చేసి, చంపేస్తామంటూ బెదిరించిన ఎన్టీఆర్ ఫ్యాన్స్పై పోలీసు కేసు నమోదు అయ్యింది.ఇప్పటికే ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఎవరైతే మీరా చోప్రాను విమర్శించారో వారిని గుర్తించే పనిలో ఫ్యాన్స్ ఉన్నారు.
మీరా చోప్రాపై బ్యాడ్ కామెంట్స్ చేసిన వారిలో ప్రధానంగా 50 మందిపై చర్యలకు పోలీసులు సిద్దం అయ్యారు.వారి అకౌంట్స్ను ఇప్పటికే గుర్తించారు.
అయితే వాటిలో కొన్ని అకౌంట్స్ను డిలీట్ చేశారు.
అకౌంట్స్ డిలీట్ చేయడంతో వారిని గుర్తించడం ఇబ్బందిగా మారింది.
తప్పుడు సమాచారంతో పలువురు ట్విట్టర్ అకౌంట్ను ఉపయోగిస్తూ ఉండగా మరికొందరు విదేశాల్లో ఉన్నట్లుగా తెలుస్తోంది.దాంతో 50 మందిలో దాదాపుగా 30 మందిని పట్టుకోవడం కష్టతరంగా మారింది.
వారి వివరాలను ఇవ్వాలంటూ ట్విట్టర్కు ఇప్పటికే పోలీసు శాఖ లేఖ రాయడం జరిగింది.ట్విట్టర్ సంస్థ వారు ఆ విషయంలో త్వరలోనే స్పష్టత ఇస్తారని పోలీసులు ఆశిస్తున్నారు.
![Telugu Meera Chopra, Ntr Fans, Telangana-Movie Telugu Meera Chopra, Ntr Fans, Telangana-Movie](https://telugustop.com/wp-content/uploads/2020/06/Telangana-Police-Failed-To-Find-Out-The-NTRFans.jpg)
ట్విట్టర్ ఇప్పటికే డిలీట్ అయిన అకౌంట్స్కు సంబంధించిన డేటాను పోలీసులకు ఇచ్చినా వారు సరైన వివరాలతో ట్విట్టర్లో అకౌంట్ ఓపెన్ చేశారో లేదో తెలియదు.కనుక నిజమైన నింధితులను పట్టుకోవడం సాధ్యం కాకపోవచ్చు అంటూ కొందరు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. మీరా చోప్రా విషయంలో కేటీఆర్ కూడా స్పందించడంతో కేసు తీవ్రత అధికంగా ఉందని అంటున్నారు.కాని పోలీసులు మాత్రం వారిని గుర్తించడంలో కాస్త ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
ఎలాగైనా ఈ కేసులో మీరా చోప్రాకు న్యాయం చేస్తామని పోలీసులు హామీ ఇస్తున్నారు.