ఇల్లంతకుంట మండల కేంద్రంలో రోడ్డు పనులను పరిశీలించిన ఎంపీపీ

రాజన్న సిరిసిల్ల జిల్లా( Rajanna Sircilla ) ఇల్లంతకుంట మండల కేంద్రంలో భారీ వర్షాలతో దెబ్బతిన్న రోడ్డు మరమ్మత్తు పనులను ఎంపీపీ వుట్కూరి వెంకటరమణారెడ్డి శనివారం పరిశీలించారు.స్థానిక సర్పంచ్ కూనబోయిన భాగ్యలక్ష్మి బాలరాజు, ఎంపీటీసీ సభ్యులు ఒగ్గు నరసయ్య యాదవ్ ఆధ్వర్యంలో రోడ్డు మరమ్మత్తు పనులను( Road Repair Works ) పరిశీలించారు.

 Mpp Observes Ellantakunta Mandal Road Repair Works ,ellantakunta Mandal , Rajann-TeluguStop.com

ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ ఆదేశాల మేరకు తాత్కాలిక మరమ్మత్తులు చేపట్టుతున్నామని , త్వరలోనే ఇల్లంతకుంట మండల కేంద్రంలో శాశ్వతంగా ఏలాంటి ఇబ్బందులు లేకుండా మంచి రోడ్డు నిర్మాణం చేపడతామన్నారు.గతంలో డివైడర్ను ఏర్పాటు చేయడం జరిగిందని, అయితే రోడ్డు విస్తరణ పనులకు కొంత ఆటంకం కలిగిన స్వచ్ఛందంగా అంబేద్కర్ దగ్గర దుకాణదారులు సహకరించారని, మిగతా వారందరూ కూడా గ్రామపంచాయతీ తీర్మానానికి అనుగుణంగా రోడ్డు మరమ్మత్తు పనులకు ,విస్తరణ పనులకు సహకరించాలన్నారు.

త్వరలోనే మంజూరైయిన కోటి రూపాయలతో డ్రైనేజీ ఏర్పాటు చేస్తూ డివైడర్ పనులను చకచక చేయిస్తూ, అదేవిధంగా సిసి రోడ్డు నిర్మాణాన్ని కూడా చేయిస్తామన్నారు.పూర్తి స్థాయిలో ఆర్ అండ్ బి అధికారులతో, ఇతర శాఖ అధికారులతో మాట్లాడి నివేదిక తయారుచేసి గౌరవ ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ ఆధ్వర్యంలో మండల కేంద్రంలో రోడ్డు నిర్మాణ పనులు చేపట్టుతామన్నారు.

ఈ కార్యక్రమంలో ఇల్లంతకుంట వార్డు సభ్యులు, ప్రజా ప్రతినిధులు, నాయకులు తదితరులు పాల్గొన్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube