కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా(మావోయిస్ట్) పేరుతో టీడీపీ నేతల ను హెచ్చరిస్తూ ఒక లేఖ బయటపడింది.దీనితో అక్కడ తీవ్ర కలకలం రేగింది.
మావోయిస్ట్ ఈస్ట్ డివిజన్ కమిటీ కార్యదర్శి కైలాసం పేరుతో ఆ లేఖ విడుదల అయినట్లు తెలుస్తుంది.అయితే ఆ లేఖలో టీడీపీ నేతలు అయ్యన్న పాత్రుడు,కిడారి శ్రవణ్,గిడ్డి ఈశ్వరి లను హెచ్చరిస్తూ ఆ లేఖ విడుదల అయ్యింది.
ఆ లేఖలో మావో లు పలు అంశాల పై ప్రశ్నలు సంధించారు.మే 1న పనసలొద్ది, కొత్తవాదులపల్లి గ్రామాలపై పోలీసులు దాడి చేసి ఆరుగురు రైతులను చిత్రహింసలకు గురిచేశారని, తక్షణం వారిని విడుదల చేయాలి అంటూ లేదంటే ప్రజలు బుద్ది చెబుతారని ఆ లేఖలో హెచ్చరించారు.
మన్యంలో మావోయిస్టుల వరుస లేఖలు అక్కడ తీవ్ర స్థాయిలో కలకలం సృష్టిస్తున్నాయి.
గిరిజన గ్రామాలపై నిత్యం పోలీసులు దాడులు, అక్రమ అరెస్టులు, వేధింపులు, చిత్రహింసలు, బలవంతపు లొంగుబాట్లతో మన్యంలో పోలీసులు రాజ్యమేలుతున్నారని, వాటినన్నిటిని మానుకోక పొతే ప్రజలే వారి పని పడతారు సీపీఐ మావోయిస్ట్ ఈస్ట్ డివిజన్ కమిటీ కార్యదర్శి కైలాసం హెచ్చరించారు.
గత 35 సంవత్సరాలుగా ఆదీవాసి పీడిత ప్రజలు అడవిపై హక్కు కోసం పోరాడుతున్నారని మన్యంలో ఆదివాసీలుగా పుట్టిన మీరు, ఆదివాసీల ఓట్లతో గెలిచిన మీరు.ఈ ఆదివాసీ ప్రజల కష్టాలలో వున్నప్పుడు పట్టించుకోరా? అని అంటూ ఆ లేఖద్వారా మావోయిస్టులు ప్రశ్నించారు.గతేడాది మన్యం లో మావో లు కిడారి శ్రవణ్ తండ్రి కిడారి సర్వేశ్వరరావు ను హతమార్చిన సంగతి తెలిసిందే.