ప్రియుడి మోజులో పడిన భార్య... దారుణంగా...

ప్రస్తుత కాలంలో కొందరు వివాహితులు వివాహేతర సంబంధాల మోజులో పడి కట్టుకున్న భర్తను, కడుపున పుట్టిన పిల్లలను సైతం వదిలి పెట్టడానికి వెనకాడడం లేదు.తాజాగా ఓ వివాహిత తాను నివసించేటువంటి ప్రాంతంలో స్థానికంగా ఉన్నటువంటి ఓ వ్యక్తి తో వివాహేతర సంబంధం పెట్టుకొని చివరికి అతడి వద్దకే వెళ్ళి పోయి దారుణంగా హత్యకు గురైన ఘటన దేశంలోని తమిళనాడు రాష్ట్రంలో చోటుచేసుకుంది.

 Married Women Murdered In Tamil Nadu, Married Women, Murder, Crime News, Illega-TeluguStop.com

వివరాల్లోకి వెళితే స్థానిక రాష్ట్రానికి చెందినటువంటి వేలూరు పట్టణ పరిసర ప్రాంతంలో ఓ వివాహిత తన భర్త పిల్లలతో కలిసి నివాసం ఉంటోంది.అయితే వివాహిత భర్త సంపాదన నిమిత్తమై భార్యను కొంతమేర నిర్లక్ష్యం చేయడంతో ఆమె వివాహేతర సంబంధాల వైపు మొగ్గు చూపింది.

స్థానికంగా ఉన్నటువంటి ఓ వ్యక్తితో వివాహేతర సంబంధం పెట్టుకుంది.ఈ క్రమంలో భర్త పనుల నిమిత్తం బయటకు వెళ్లిన సమయంలో వివాహిత తన ప్రియుడిని కలుసుకుంటూ ఉండేది.

అయితే ఈ విషయం తెలుసుకున్నటువంటి ఆమె భర్త పలుమార్లు హెచ్చరించినప్పటికీ తన భర్త మాటలు పట్టించుకునేది కాదు.అయితే ఈ విషయం గురించి ఈ మధ్య కాలంలో గొడవలు ఎక్కువ అవుతుండడంతో వివాహిత  భర్త, పిల్లలను వదిలి పెట్టి తన ప్రియుడితో కలిసి వెళ్లిపోవాలని నిశ్చయించుకుంది.

ఇందులో భాగంగా తన ప్రియుడితో కలిసి ద్విచక్ర వాహనంపై పరార్ అయింది.ఈ క్రమంలో కొందరు గుర్తు తెలియని వ్యక్తుల చేతిలో ప్రియుడు మరియు వివాహిత దారుణ హత్యకు గురయ్యారు.

దీంతో స్థానికుల నుంచి సమాచారం అందుకున్నటువంటి పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని పరిశీలించి ఫిర్యాదు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube