విభజన సమస్యలపై కేంద్రమంత్రి కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు.విభజన అంశంపై రెండు తెలుగు రాష్ట్ర ప్రభుత్వాలు కూర్చుని మాట్లాడుకోవాలని, సమస్యలు పరిష్కరించుకోవాలన్నారు.
గతంలో కేంద్రం రెండు రాష్ట్రాలతో అనేక సమావేశాలు నిర్వహించిందని తెలిపారు.అదేవిధంగా బయ్యారం ఉక్కు ఫ్యాక్టరీ సాధ్యం కాదన్నారు.
దాన్ని ఏర్పాటు చేస్తే ప్రజాధనం వృధా చేయడమే అవుతుందని వ్యాఖ్యానించారు.విశాఖ స్టీల్ ప్లాంట్ విషయంలో ఇదే పరిస్థితి ఎదురయిందని తెలిపారు.
ఈ క్రమంలోనే నష్టాలు భరించడం కోసం సెయిల్ ను సంప్రదించామని వెల్లడించారు.