సూపర్ స్టార్ మహేష్ బాబు ‘సర్కారు వారి పాట’ సినిమాతో ఇటీవలే బ్లాక్ బస్టర్ హిట్ కొట్టాడు.మహేష్ బాబు ఈ సినిమా తర్వాత త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో సినిమా చేయనున్నాడు.
ఈ క్రమంలోనే ఈ సినిమా నుండి ఏదొక అప్డేట్ వస్తూనే ఉంది.త్రివిక్రమ్ అల వైకుంఠపురంలో సినిమా తర్వాత మరో సినిమా చేయలేదు.దీంతో ఇప్పుడు చేసే సినిమా గ్యాప్ లేకుండా చేయాలని అనుకున్నాడు.
11 ఏళ్ల తర్వాత వీరి కలయికలో సినిమా రాబోతుండడంతో భారీ అంచనాలు నెలకొన్నాయి.జులై నెలలో సెట్స్ మీదకు వెళ్లనుందని సమాచారం అందుతుంది.ఈ సినిమాను వచ్చే సంక్రాంతిని రిలీజ్ చేయాలనీ ప్లాన్ చేస్తున్నారు.ఇక ఇందులో మహేష్ కు జోడీగా పూజా హెగ్డే హీరోయిన్ గా నటిస్తుండగా.హారిక హాసిని బ్యానర్ వారు ఈ సినిమాను నిర్మిస్తున్నారు.
ఇక ఈ సినిమాలో మహేష్ బాబు ద్విపాత్రాభినయం చేస్తున్న విషయం విదితమే.SSMB28 వర్కింగ్ టైటిల్ తో తెరకెక్కుతున్న ఈ సినిమాకు థమన్ సంగీతం అందిస్తున్నాడు.ఇది ఇలా ఉండగా ఈ సినిమా నుండి తాజాగా మరొక వార్త నెట్టింట వైరల్ అయ్యింది.ఈ సినిమాలో కీలకమైన తండ్రి పాత్ర ఉందని.
అది సినిమాకే హైలెట్ అని తెలుస్తుంది.
ఈ పాత్ర కోసం అనిల్ కపూర్ నటిస్తున్నాడని గతంలో వార్తలు వచ్చాయి.అయితే ఇప్పుడు ఆ పాత్ర కోసం మరో స్టార్ పేరు వినిపిస్తుంది.కన్నడ స్టార్ హీరో ఉపేంద్ర మహేష్ బాబు ఫాదర్ రోల్ లో నటించనున్నాడని తెలుస్తుంది.
అయితే కేవలం ప్లాష్ బ్యాక్ లో మాత్రమే ఈయన రోల్ ఉంటుంది అని.మహేష్ ఉపేంద్ర కాంబోలో సీన్స్ అనేవి అసలు ఈ సినిమాలో ఉండవని.ఇప్పుడు ఒక క్రేజీ టాక్ బయటకు వచ్చింది.మరి ఇందులో నిజమెంతో తెలియాలంటే మరికొద్ది రోజులు వేచి ఉండాల్సిందే.