ప్రస్తుతం టాలీవుడ్ ఇండస్ట్రీలో టాప్ మోస్ట్ మ్యూజిక్ డైరెక్టర్ గా ఎంతో మంచి పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్న దేవిశ్రీప్రసాద్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.దేవి సినిమా ద్వారా అతని ప్రస్థానం మొదలుపెట్టిన దేవి శ్రీప్రసాద్ ఎన్నో అద్భుతమైన చిత్రాలకు సంగీతం అందించి విశేషమైన గుర్తింపు సంపాదించుకున్నారు.
తాజాగా దేవి శ్రీ ప్రసాద్ పుష్ప సినిమాకి అందించిన సంగీతం ప్రతి ఒక్క ప్రేక్షకుడిని మంత్రముగ్ధులను చేస్తోంది.ఈ సినిమాలో పాటలకి అందించిన మ్యూజిక్ ప్రతి ఒక్క ప్రేక్షకుడిని మ్యాజిక్ చేసిందని చెప్పవచ్చు.
పుష్ప సినిమా పాన్ ఇండియా చిత్రం కావడంతో ఈయన పేరు నేషనల్ వైడ్ గా మార్మోగి పోతోంది.ఇదిలా ఉండగా టీసీరీస్ అధినేత భూషణ్ కుమార్ దేవిశ్రీప్రసాద్ పై ప్రశంసలు కురిపిస్తూ అతని ఆకాశానికి ఎత్తేశారు.
ఈ సందర్భంగా ఆయన ట్వీట్ చేస్తూ…గతంలో దేవి శ్రీ ప్రసాద్ మ్యూజిక్ అందించిన ఎన్నో సినిమాలు హిందీలో డబ్ అయ్యాయి.కానీ ఇప్పటి వరకు దేవి శ్రీ ప్రసాద్ స్ట్రైట్ గా ఒక్క హిందీ సినిమాకి మ్యూజిక్ అందించలేదని చెప్పుకొచ్చారు.
అయితే ప్రస్తుతం దేవిశ్రీప్రసాద్ బాలీవుడ్ ఎంట్రీకి సమయం ఆసన్నమైందని ఎంతోమంది అభిమానులు వారి అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు.ఇదిలా ఉండగా దేవిశ్రీప్రసాద్ భూషణ్ కుమార్ ని కలవడంతో ఈ అనుమానాలకు మరింత బలం చేకూర్చాయి.టీ సిరీస్ సంస్థ నిర్మిస్తున్న ఈ భారీ బడ్జెట్ చిత్రానికి సంగీతం దేవిశ్రీ ప్రసాద్ అందించబోతున్నారని తెలుస్తోంది.అయితే త్వరలోనే ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటించనున్నట్లు తెలుస్తోంది.