మలయాళ స్టార్ హీరో దుల్కర్ సల్మాన్ తెలుగు ప్రేక్షకులకు సుపరిచితుడే.ఆయన నటించిన పలు సినిమాలు తెలుగు ప్రేక్షకులను మెప్పించాయి.
ఇక ఆయన తెలుగులో మహానటి చిత్రంతో స్టార్గా ఎదిగి పోయాడు.ఇప్పుడు ఆయనతో మరో తెలుగు సినిమాను తీసేందుకు అశ్వినీదత్ కూతుర్లు సిద్దం అయ్యారు.
స్వప్న సినిమా బ్యానర్లో హనురాఘవపూడి దర్శకత్వంలో భారీ ఎత్తున ఒక చిత్రంను దుల్కర్ సల్మాన్ హీరోగా రూపొందిస్తున్నట్లుగా స్వయంగా అశ్వినీదత్ ప్రకటించాడు.
ఇటీవల జగదేక వీరుడు అతిలోక సుందరి చిత్రం 30 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్బంగా మీడియాతో మాట్లాడాడు.
ఆ సమయంలో తమ రాబోతున్న సినిమాల గురించిమ ఆట్లాడిన ఆయన హను రాఘవపూడి దర్శకత్వంలో ఒక విభిన్నమైన చిత్రాన్ని దుల్కర్ సల్మాన్తో తెలుగులో తెరకెక్కించేందుకు ఏర్పాట్లు చేస్తున్నాం.చిన్న చిత్రాలతో పాటు పెద్ద సినిమాలను కూడా వరుసగా నిర్మిస్తూ ప్రేక్షకులను ఎంటర్టైన్ చేసేందుకు మా ప్రయత్నాలు చేస్తున్నామన్నాడు.
అందాల రాక్షసి చిత్రం తర్వాత దర్శకుడు హను రాఘవపూడి చేసిన సినిమాలు బాక్సాఫీస్ వద్ద నిరాశ పర్చాయి.ముఖ్యంగా లై చిత్రం తీవ్ర నష్టాలను చవిచూసేలా చేసింది.దాంతో ఆయన మళ్లీ దర్శకుడిగా సినిమా చేసేనా అంటూ అనుమానాలు వ్యక్తం అయ్యాయి.అయితే అశ్వినీదత్ ఆయనకు ఛాన్స్ ఇచ్చాడు.మంచి కథతో దుల్కర్ సల్మాన్ హీరోగా ఒక చిత్రంను ఈయన రూపొందిస్తున్నాడు.దాంతో మళ్లీ ఈయన స్టార్ హీరోలకు మోస్ట్ వాంటెడ్ అవుతాడని అంతా నమ్మకంగా చెబుతున్నారు.