రాజన్న సిరిసిల్ల జిల్లా( Rajanna Sirisilla District ) : వేములవాడ రాజన్న ను దర్శించుకున్న ధర్మపురి ఎమ్మెల్యే లక్ష్మణ్ కుమార్.( Laxman Kumar ) అనంతరం ప్రత్యేక పూజలు చేసి కోడె మొక్కులు చెల్లించుకున్నారు.
ఆలయ అర్చకులు స్వామి వారి దర్శనము అనంతరం నాగిరెడ్డి మండపంలో వేదోక్త ఆశీర్వచనం చేసినారు.ప్రోటోకాల్ పర్యవేక్షకులు సీరిగిరి శ్రీరాములు( Srigiri Sriramulu ) లడ్డు ప్రసాదం అందజేశారు.
వారి వెంట ఆలయ పర్యవేక్షకులు తిరుపతిరావు,గోలి శ్రీనివాస్, పట్టణ సీఐ కరుణాకర్ ఉన్నారు.