వెంకీ కుడుముల దర్శకత్వంలో నాగ సౌర్య హీరోగా నటించిన సినిమా ఛలో.ఈ సినిమాతో మంచి హిట్ ను తన ఖాతాలో వేసుకున్నాడు నాగ సౌర్య.ఈ సినిమా వెంకీ కుడుములు మొదటి సినిమా.అంతేకాదు ఈ సినిమాతోనే రష్మిక మందన్న తెలుగు తెరకు పరిచయమైంది.
ఈ సినిమాను ఇరా క్రియేషన్స్ బ్యానర్ ఫై నాగ సౌర్య తల్లి ఉష ముళ్ళపూరి నిర్మించారు.ఈ చిత్రం నాగ సౌర్య కు ఎక్కువ కలెక్షన్లు సాధించిన చిత్రంగా నిలిచింది.
ఈ చిత్రం 50 రోజులు పూర్తి చేసుకుంది.ఈ సినిమాను హిందీలో కూడా డబ్ చేసారు.
ఈ సినిమా బాగా హిట్ అయ్యిందని నాగ సౌర్య తల్లి ఉష ముళ్ళపూరి వెంకీ కుడుములకు ఒక కాస్ట్లీ కారును గిఫ్ట్ గా ఇచ్చింది.ఇక్కడ వరకు బాగానే ఉన్నా ఆ తర్వాత వెంకీ కుడుముల, నాగ సౌర్య మధ్య అభిప్రాయ భేదాలు వచ్చాయి.
అవి మూడు సంవత్సరాలయినా అలాగే ఉన్నాయని తెలుస్తుంది.
నాగ సౌర్య ఛలో మూవీ స్టోరీ నాదే అంటూ ఒక ఇంటర్వ్యూలో చెప్పాడు.
దీంతో వెంకీ కుడుముల హర్ట్ అయినట్లు అప్పట్లో వార్తలు వచ్చాయి.అయితే అక్కడితో ఈ గొడవలు ఆగలేదు.
వెంకీ కుడుములను తన ఫ్యామిలీ మెంబెర్ గా భావించామని.కానీ వెంకీ తన అమ్మ ఎంతో ప్రేమగా ఇచ్చిన కారును అమ్మేసాడని నాగ సౌర్య వ్యాఖ్యానించారు.
కానీ ఈ విషయంపై వెంకీ కుడుముల స్పందిస్తూ.నేను కారును అమ్మలేదని చెప్పాడు.ఆ తర్వాత సినిమాలతో ఇద్దరూ బిజీ అయిపోయిన ఇంకా కోల్డ్ వార్ నడుస్తూనే ఉంది.ఈ విషయం ఛలో సినిమా వచ్చి మూడేళ్లు అయిన సందర్భంగా ఈ రోజున మళ్ళీ బయటపడింది.
ఛలో సినిమా తర్వాత వెంకీ కుడుముల నితిన్ తో భీష్మ సినిమా చేసి మరొక హిట్ ను తన ఖాతాలో వేసుకున్నాడు.అయితే ఈ రోజు ఛలో సినిమా విడుదల అయ్యి మూడేళ్లు అయినా సందర్భంగా వెంకీ కుడుముల, నాగ సౌర్య ఇద్దరూ ట్విట్టర్లో ట్వీట్లు చేసారు.
నాగ శౌర్య తన తల్లికి కంగ్రాట్స్ చెబుతూ ట్వీట్ చేసాడు.అమ్మ నువ్వు ఎప్పుడూ నా సూపర్హీరో.ఛలో చేసినందుకు థ్యాంక్స్.నిర్మాతగా మూడు సంవత్సరాలు పూర్తి చేసుకున్నందుకు కంగ్రాట్స్ మేడమ్ గారు అని ట్వీట్ చేశాడు.
అలాగే వెంకీ కుడుముల ట్వీట్ చేస్తూ.ఈ రోజు నేను ఎప్పటికీ గుర్తుంచుకునే రోజు.
మీ అందరి ప్రేమ, ఆశీస్సులు థాంక్స్ అని ట్వీట్ చేసాడు. అయితే ఈ ట్వీట్స్ లో ఒకరిని ఒకరు విష్ చేసుకోలేదు.
అలాగే పేరు కూడా ప్రస్తావించలేదు.అంతేకాదు మూవీ పోస్టర్ ను కూడా షేర్ చేసుకోలేదు.
ఇదంతా చుసిన నెటిజన్లు వీరిద్దరి మధ్య ఇంకా కోల్డ్ వార్ నడుస్తుందని చెప్పుకుంటున్నారు.