సీపీఎస్ పై ఏపీ మంత్రివర్గ ఉపసంఘం సమావేశం అయింది.సచివాలయంలోని ఆర్థిక శాఖ ఛాంబర్ లో చేపట్టిన ఈ భేటీకి నాలుగు ఉద్యోగ సంఘాలకు ఆహ్వానం అందింది.
నాన్ గెజిటెడ్ ఆఫీసర్స్ అసోసియేషన్, సచివాలయ ఉద్యోగుల సంఘం, రెవెన్యూ సర్వీసెస్ సంఘం, ప్రభుత్వ ఉద్యోగుల సంఘాలను ప్రభుత్వం ఆహ్వానించింది.అయితే సీపీఎస్ సంఘాలను స్వాగతించడం ఇదే మొదటిసారి కావడం గమనార్హం.
ఈ సమావేశంలో ఆర్థిక శాఖ, విద్యా శాఖ, పట్టణాభివృద్ధి శాఖ మంత్రులతో పాటు ప్రభుత్వ సలహాదారు సజ్జల, ఉన్నతాధికారులు హాజరు అయ్యారు.