ప్రజా ఆశీర్వాద సభను విజయవంతం చేసిన ప్రజలకు బిఆర్ఎస్ పార్టీ కార్యకర్తలకు కృతజ్ఞతలు

రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలో మంగళవారం పెద్ద ఎత్తున జరిగిన తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రజా ఆశీర్వాద సభకు పెద్ద ఎత్తున తరలి వచ్చి విజయవంతం చేసినందుకు ప్రజలకు బిఆర్ఎస్ పార్టీ కార్యకర్తలకు ఎల్లారెడ్డిపేట బిఆర్ఎస్ పార్టీ పట్టణ అధ్యక్షులు బండారి బాల్ రెడ్డి కృతజ్ఞతలు తెలిపారు.ఈ సందర్భంగా బుధవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో బిఆర్ఎస్ పార్టీ పట్టణ అధ్యక్షులు బండారి బాల్ రెడ్డి మాట్లాడుతూ సిరిసిల్ల అబివృద్ది ప్రదాత అయినా రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ గెలుపును ఎవరు ఆపలేరని ప్రజా ఆశీర్వాద సభ రుజువు చేస్తుందని ఆయన అన్నారు.

 Brs Party Workers Are Thankful For Making Praja Ashirwada Sabha A Success, Brs P-TeluguStop.com

తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రవేశపెట్టి అమలు చేస్తున్న అనేక సంక్షేమ పథకాల గురించి రాష్ట్రము, సిరిసిల్ల నియోజకవర్గం అప్పుడు ఎట్లా ఉండే ఇప్పుడు ఎట్లుంది దాన్ని ప్రజలకు వివరించి ఓట్లను పొంది కేటీఆర్ ని అత్యధిక మెజార్టీతో గెలిపించుకోవాలని ఆయన ప్రజలకు విజ్ఞప్తి చేశారు.బిఆర్ఎస్ పార్టీ ప్రవేశపెట్టిన మెనిపేస్టో తో పాటు సిరిసిల్ల జిల్లా కేంద్రంలో విజయవంతమైన ముఖ్యమంత్రి ప్రజా ఆశీర్వాద సభ కెటిఆర్ గెలుపును ఎవరు ఆపలేరని రుజువు చేస్తుందన్నారు.

ప్రజా ఆశీర్వాద సభకు తరలివచ్చి సభను విజయవంతం చేసిన ప్రతి ఒక్కరికి పేరుపేరునా ఆయన కృతజ్ఞతలు తెలిపారు.ఈ సమావేశంలో బిఆర్ఎస్ పార్టీ నాయకులు గోషిక దేవదాస్, అజ్జాబాయి, కొర్రి ప్రమోద్ తదితరులు పాల్గొన్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube