రాజమండ్రి లో ఉండవల్లి అరుణ్ కుమార్ ను కలిశారు బ్రదర్ అనిల్ కుమార్ ఇరువురు కాసేపు చర్చించారు .రాజకీయాలు అంటే మంచి చేయటమని… రాజకీయ జ్ఞానం తెలుసుకునేందుకు ఉండవల్లిని కలిసినట్లు బ్రదర్ అనిల్ అన్నారు.
శుక్రవారం మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్తో అనిల్ భేటీ అయ్యారు.అనంతరం అనిల్ మీడియాతో మాట్లాడుతూ మా సీక్రెట్లు మాకు ఉంటాయి.
అవసరం వచ్చినప్పుడు బయటకు వస్తాయి అని తెలిపారు.హిందూ మతోన్మాదం ఈ మధ్య పెరిగిందన్నారు.
తాను ఏసుప్రభుని నమ్ముకున్నానని, దేవుడు చెప్పకుండా ఏ పని చేయనని అనిల్ పేర్కొన్నారు.
భేటీపై మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ మాట్లాడుతూ.
బ్రదర్ అనిల్తో ఉన్న కుటుంబ సంబంధం నేపథ్యంలో ఈరోజు మళ్ళీ కలిసినట్లు వెల్లడించారు.రాజకీయ, కుటుంబ పరిస్థితులపై చర్చించామన్నారు.
భీమవరం వెళుతూ తనను కలిశారని.ఈ సందర్భంగా ఏపీ విభజన చట్టం పుస్తకాన్ని అనిల్కు అందజేసినట్లు ఉండవల్లి అరుణ్ కుమార్ తెలిపారు.