ఆర్ఎక్స్ 100తో సూపర్ హిట్ కొట్టి ఇండస్ట్రీలో అందరి దృష్టిని తనవైపుకి తిప్పుకున్న దర్శకుడు అజయ్ భూపతి.మొదటి సినిమాతోనే మెస్మరైజ్ చేసిన అజయ్ భూపతితో రెండో సినిమా కోసం చాలా మంది నిర్మాతలు అతనికి అడ్వాన్స్ లు ఇచ్చి రెడీగా ఉన్నారు.
అయితే అజయ్ భూపతి రెండో సినిమాకి రెండేళ్ళ నుంచి మహా సముద్రం అనే సబ్జెక్ట్ పట్టుకొని తిరుగుతున్నాడు.ఈ కథతో చాలా మంది హీరోల చుట్టూ తిరిగిన ఎవరు కూడా ముందుకి రాలేదు.
మొదటి సినిమాలాగే ఈ సినిమాకి కూడా హీరోల నుంచి అతనికి అయిష్టతే ఎదురైంది.
అయితే ఫైనల్ గా ఈ కథతో హీరో శర్వానంద్ ని, సిద్ధార్ధని అజయ్ భూపతి ఒప్పించి త్వరలో సెట్స్ పైకి వెళ్ళడానికి రెడీ అవుతున్నాడు.
ఇక ఇందులో హీరోయిన్ గా ముందు సమంత పేరు వినిపించింది, తరువాత సాయి పల్లవి పేరు తెరపైకి వచ్చింది.ఫైనల్ గా అదితీరావ్ హైదరీ దగ్గర ఆగింది.
ఈ చిత్రంలో శర్వానంద్ సరసన హీరోయిన్ అదితిరావు హైదరీని చిత్రబృందం ఎంపిక చేసింది.ఇందులో ఒకే హీరోయిన్కు అవకాశం ఉన్నట్లు సమాచారం.
సాయి పల్లవి కూడా ఈ సినిమాపై పెద్దగా ఆసక్తి చూపించకపోవడంతో దర్శకుడు ఫైనల్ గా అదితీరావ్ తో ఒకే చేయించుకున్నట్లు తెలుస్తుంది.అయితే ఈ విషయాన్ని అఫీషియల్ గా కన్ఫర్మ్ చేసేంత వరకు వేచి చూడక తప్పదు.