తెలుగు బిగ్గెస్ట్ రియాలిటీ షో బిగ్ బాస్ నాల్గువ సీజన్ మొదట కాస్త బోరింగ్గా సాగినా.నాల్గువ వారం వచ్చే సరికి మాత్రం రసవత్తరంగా మారిందని చెప్పాలి.
విభిన్న టాస్క్లతో, గొడవలతో బుల్లితెర ప్రేక్షకులకు కావాల్సినంత ఎంటర్టైన్మెంట్ ఇస్తున్న బిగ్ బాస్.మరో వైపు ఇంటి సభ్యుల మధ్య నడుస్తున్న లవ్ ట్రాకులు చూపిస్తూ మరింత హైప్ క్రియేట్ చేస్తున్నారు.
అయితే బిగ్ బాస్ హౌస్ మోస్ట్ స్పెషల్ ట్రాక్ ఏదైనా ఉందా అంటే.అది అఖిల్- మోనాల్- అభిజిత్ ట్రై యాంగిల్ ట్రాక్ అనే చెప్పాలి.
మోనాల్ అటు అభిజిత్.ఇటు అఖిల్ ఇద్దరినీ ఇష్టపడుతున్నట్టు బిగ్ బాస్ చూపిస్తున్నాడు.హోస్ట్ గా వ్యవహరిస్తున్న నాగార్జున కూడా మోనాల్ మనసులో ‘ఎ’ ఉందని హింట్ ఇచ్చారు.అయితే `ఎ` అంటే అఖిలా.
లేక అభిజిత్నా అన్నది ఇంటి సభ్యులకు, చూసే ప్రేక్షకులకు క్లారిటీ రావడం లేదు.ఇక అఖిల్ ఎప్పుడూ మోనాల్తోనే ఉంటున్నాడు.
కానీ, అభిజిత్ మాత్రం.మోనాల్ లేదా హారిక లేదా వైల్డ్ కార్డు ద్వారా వచ్చిన స్వాతి దీక్షిత్ ముగ్గురితోనూ పులిహోర కలుపుతున్నాడు.
ముఖ్యంగా స్వాతి దీక్షిత్ రాకతో.మోనాల్ను మెల్ల మెల్లగా పక్కన పెట్టేస్తున్నాడు అభిజిత్.ఈ క్రమంలోనే నిన్న జరిగిన ఎపిసోడ్ నాకు ట్రై యాంగిల్ ట్రాక్ వద్దంటూ.బిగ్ బాస్ వూహాన్ని బయటపెట్టేశాడు.
అర్థరాత్రి హారికతో ముచ్చట్లు పెట్టిన అభిజిత్.`ఎ` అంటూ నాపై నెటిటివ్ ప్రచారం చేస్తున్నారు.
మొదటి నుంచి బిగ్ బాస్ వాళ్లు ప్లాన్ చేస్తున్నది ట్రై యాంగిల్ ట్రాక్ కోసమే.అది నాకు తెలుసు.
కానీ, నాకు ఆ ట్రై యాంగిల్ వద్దు.ఎందుకంటే, అది ఒక దరిద్ర్యమైన యాంగిల్.ఆ యాంగిల్ నాకు నచ్చలేదు.అమ్మ వాళ్లు అందరూ నన్ను చూస్తుంటారు.
వాళ్లకు కూడా ఇది చూసేందుకు చండాలంగా ఉంటుంది అంటూ అభిజిత్ హారిక ముందు ఓపెన్ అయ్యాడు.కాగా, గత సీజన్లో కూడా పునర్నవి, రాహుల్ల మధ్య ఏదో నడుస్తుందని ప్రేక్షకుల్లో బిగ్ బాస్ అనుమానాలు పెంచిన సంగతి తెలిసిందే.
అయితే ఇప్పుడు కూడా అదే వూహాన్ని అమలు చేసేందుకు బిగ్ బాస్ ప్రయత్నిస్తున్నాడని స్పష్టంగా అర్థం అవుతోంది.