హైదరాబాద్ చేరిన కంగనా కారణమేంటంటే?

సుశాంత్ సింగ్ రాజపుత్ చనిపోయినప్పటి నుండి కంగనా రనౌత్ ప్రతిరోజు వార్తల్లో నిలుస్తున్న విషయం తెలిసిందే, మహారాష్ట్ర సీఎం ఠాక్రే తో గొడవ కారణంగా తన ఆఫీస్ ను కూడా కోల్పోయిన కంగనా ముంబై ని పాక్ ఆక్రమిత కాశ్మీర్ తో పోల్చింది.దీనిపై పెద్ద రభస జరిగిన విషయం అందరికీ విదితమే.

 Kangana Ranaut Reaches Hyderabad, Kangana Ranaut, Hyderabad, Jayalalithaa Biopic-TeluguStop.com

ఈ గొడవల కారణంగా కేంద్ర ప్రభుత్వం ఆమెకు Z కేటగిరీ భద్రతను కల్పిచింది, ఇంత హడావుడికి కారణమైన కంగనా తాజాగా హైదరాబాద్ లో అడుగు పెట్టింది, తను హైదరాబాద్ రావడానికి కారణమేంటి అని చాలా మంది ఆశ్చర్యపోతున్నారు.

తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి జయలలిత బయోపిక్ తలైవి లో కంగనా నటిస్తున్నారు.

ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం హైదరాబాద్ లో జరుగుతుంది.ఈ కారణంగా కంగనా ట్విట్టర్ లో ఏడు నెలల తరువాత సౌత్ ఇండియా వెళ్తున్నాను అని పోస్ట్ చేసింది.

చాలా కాలం తర్వాత షూటింగ్ లో పాల్గొన్న కంగనా తనకు ప్రజలందరి ఆశీర్వాదం కావాలని కోరింది.తలైవిని వచ్చే ఏడాది ఆరంభంలో తమిళం తో పాటు తెలుగు, హిందీ భాషల్లో భారీ ఎత్తున్న విడుదల చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube