బుల్లితెరలో ప్రసారమవుతున్న జబర్దస్త్ షో గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు.ఎన్నో ఏళ్ల నుండి ప్రసారమవుతున్న ఈ షో బుల్లితెరలో ఓ రేంజ్ లో దూసుకుపోతుంది.
ఇందులో పాల్గొన్న కమెడియన్లు కూడా తమ కామెడీ పర్ఫామెన్స్ తో మంచి గుర్తింపు తెచ్చుకొని వెండి తెరపై కూడా అవకాశాలు అందుకుంటున్నారు.ఇక ఈ షో ఈమధ్య బాగా విమర్శలు ఎదుర్కొంటుంది.
ఇదిలా ఉంటే తాజాగా ఈ షోలో మరో జంట తెగ రెచ్చిపోయారు.
జబర్దస్త్ లో ఈమధ్య శృతిమించిన డైలాగులు, సన్నివేశాలు బాగా చూస్తున్నాం.
అంతేకాకుండా ముద్దులతో, హగ్ లతో రెచ్చిపోతున్నారు కమెడియన్స్ జంటలు.ఇటీవలే బుల్లితెర ఆర్టిస్ట్ రోహిణి, రాకేష్ ను ముద్దు పెట్టుకోగా దీనికి సంబంధించిన విషయం బాగా హాట్ టాపిక్ గా మారింది.
వీళ్లే కాకుండా మరికొందరు జంటలు కూడా తమ రొమాన్స్ లతో హద్దులు దాటుతున్నారు.
ఇదిలా ఉంటే తాజాగా ఎక్స్ ట్రా జబర్దస్త్ సంబంధించిన ప్రోమో విడుదలయింది.
అందులో ఆట సందీప్, జ్యోతి జంటలుగా పాల్గొని వేదికపైనే రెచ్చిపోయారు.
స్కిట్ లో భాగంగా జ్యోతి సందీప్ దగ్గర నుంచి వెళ్తుంటే.ఆమెను ఆపి ఆమె దగ్గరికి వెళ్లి ఊపిరి గట్టిగా పిలుచుకుంటాడు.జ్యోతి ఏమైంది అని అడగగా.
నువ్వు వెళ్లిపోతే నా ఊపిరి ఆడదని అనేసరికి వెంటనే జ్యోతి సందీప్ ను గట్టిగా హగ్ చేసుకొని బుగ్గ పైకి గట్టిగా ముద్దు పెట్టుకుంది.అంతేకాకుండా కన్నుకొడుతూ మరింత రెచ్చిపోయింది.
ఇక ఈ ప్రోమో ప్రస్తుతం వైరల్ గా మారగా వీరి రొమాన్స్ ను చూసిన నెటిజన్లు తెగ కామెంట్లు చేస్తున్నారు.ఇక వీరు కూడా బిగ్ బాస్ లో పాల్గొననున్నారని గతంలో వార్తలు వినిపించిన సంగతి తెలిసిందే.
కానీ ఈ షో విడుదలయ్యాక వీరి ఎంట్రీ లేదని తెలిసింది.