తాజాగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన మోస్ట్ వెయిటింగ్ మూవీ ‘రుద్రమదేవి’ చిత్రానికి సీక్వెల్గా ‘ప్రతాప రుద్రుడు’ చిత్రాన్ని తెరకెక్కించబోతున్నట్లుగా దర్శక నిర్మాత గుణశేఖర్ ప్రకటించిన విషయం తెల్సిందే.అయితే ‘ప్రతాప రుద్రుడు’ సినిమాపై సినీ వర్గాల్లో నిన్న మొన్నటి వరకు విశ్వాసం లేకుండే.
‘రుద్రమదేవి’ చిత్రం ఫలితం అటు ఇటు అయితే ‘ప్రతాప రుద్రుడు’ తెరకెక్కే ఛాన్స్ లేదని అనుకున్నారు.కాని తాజాగా రిలీజ్ అయిన ‘రుద్రమదేవి’ యావరేజ్ టాక్ను తెచ్చుకున్నా కూడా మంచి కలెక్షన్స్తో దూసుకు పోతుంది.
‘రుద్రమదేవి’ కలెక్షన్స్ దర్శక నిర్మాత అయిన గుణశేఖర్కు సంతోషాన్ని తెచ్చి పెట్టాయి.పెట్టిన పెట్టుబడి రికవరీ అవ్వడంతో లాభాలు కూడా వచ్చే అవకాశాలున్నాయని ట్రేడ్ వర్గాల వారు అంటున్నారు.
దాంతో ధైర్యంగా గుణశేఖర్ తన తర్వాత ప్రాజెక్ట్ ‘ప్రతాప రుద్రుడు’ చిత్రాన్ని మొదలు పెట్టే అవకాశాలున్నాయి.‘రుద్రమదేవి’ ఇచ్చిన బలంతో ప్రతాప రుద్రుడును మరింత పవర్ ఫుల్గా దర్శకుడుగు గుణశేఖర్ తెరకెక్కించవచ్చని అంటున్నారు.అతి త్వరలోనే గుణశేఖర్ ప్రతాప రుద్రుడు ఎవరు అనేది తేలిపోనుంది.2017లో ఈ సీక్వెల్ను ప్రేక్షకుల ముందుకు తీసుకు వస్తానని గుణశేఖర్ అంటున్నాడు.