ఏపీలో బలంగా ఉందనుకున్న వైసీపీని( YCP ) అధికారానికి దూరం చేయడంలో టిడిపి అధినేత చంద్రబాబు( Chandrababu ) సక్సెస్ అయ్యారు.పొత్తులు పెట్టుకునే విషయంలో గానీ, ప్రజల మూడ్ ను మార్చే విషయంలో గాని చంద్రబాబు అన్ని విధాలుగా సక్సెస్ అయ్యారు.
ఫలితంగా ఏపీలో టిడిపి కూటమి అధికారంలోకి రావడం, ముఖ్యమంత్రి గా చంద్రబాబు బాధ్యతలు స్వీకరించిన జరిగింది దృష్టి పెట్టిన బాబుకు అసలు కష్టాలు మొదలయ్యాయి .అధికారం దక్కిందన్న ఆనందం పెద్దగా కనిపించడం లేదు.దీనికి కారణం నిధుల కొరత తీవ్రంగా వేధించడమే.ఏపీలో అధికారంలోకి వచ్చేందుకు టిడిపి( TDP ) ఓటమి పెద్ద ఎత్తున రజాకర్షణ పథకాలను ప్రకటించింది.ఇప్పుడు వాటిని అమలు చేయడం అతిపెద్ద సవాల్ మారింది ఇప్పటికే సామాజిక పెన్షన్లను పెంచి పంపిణీ చేపట్టారు.ప్రతినెల వేలకోట్ల సొమ్మును వీటికే.
![Telugu Amravati, Jagan, Modhi, Happiness, Prime India-Politics Telugu Amravati, Jagan, Modhi, Happiness, Prime India-Politics](https://telugustop.com/wp-content/uploads/2024/07/Power-is-not-happiness-Whyb.jpg)
ఖర్చు పెట్టాల్సి రావడం, ఇంకా అనేక సంక్షేమ పథకాలు అమలుకు నిధులు సమకూర్చడం అతిపెద్ద సవాల్ గా ప్రభుత్వానికి మారింది.దీనికి తోడు చంద్రబాబు అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్న పోలవరం ప్రాజెక్టు నిర్మాణం ( Polavaram project )పూర్తి చేయడం, అమరావతి ( Amaravati )లో రాజధానికి తగ్గట్టుగా అన్ని హంగులు సమకూర్చడం ఇవన్నీ భారీ ఖర్చుతో కూడుకున్నవే.ఐదేళ్ల పాలన లో అవి పూర్తి చేస్తేనే ప్రజల్లోనూ పరువు నిలబడుతుందని పూర్తి కాకపోతే రాజకీయంగా తీవ్ర విమర్శలు ఎదుర్కోవడంతో పాటు, ప్రజల్లో చులకన అవుతామనే భావన చంద్రబాబులో స్పష్టంగా కనిపిస్తోంది.పోలవరం తన కలలో ప్రాజెక్టుగా చంద్రబాబు చెబుతూనే వచ్చారు 2014 నుంచి 19 మధ్యకాలంలో పోలవరం ప్రాజెక్టు ను 70% చేసామని, వైసిపి ప్రభుత్వం హయంలో కేవలం రెండు శాతం మాత్రమే పనులు పూర్తయ్యాయని చంద్రబాబు చెప్తున్నారు ఇప్పుడు పూర్తిస్థాయిలో పోలవరం ప్రాజెక్టును పూర్తి చేయాలంటే నాలుగు సీజన్లు కావాలని చెబుతున్నారు.
దీంతోపాటు పోలవరం నిర్వాసితులకు నష్టపరిహారం చెల్లించి ప్రాజెక్టు నిర్మాణాన్ని పూర్తి చేయాల్సి ఉంది.
![Telugu Amravati, Jagan, Modhi, Happiness, Prime India-Politics Telugu Amravati, Jagan, Modhi, Happiness, Prime India-Politics](https://telugustop.com/wp-content/uploads/2024/07/Power-is-not-happiness-Whyd.jpg)
ఇవన్నీ చేయాలంటే భారీగా నిధులు అవసరం .ఇక అమరావతి విషయానికొస్తే దీని నిర్మాణం పూర్తి చేయడం అంటే అంత తెలికేమి కాదు.వేలకోట్ల వనరులను సమకూర్చుకోవాలంటే కచ్చితంగా కేంద్రం సహాయం చేయాల్సిందే.
అయితే కేవలం అమరావతి, పోలవరం ప్రాజెక్టుకు వేల కోట్ల నిధులను కేంద్ర అధికార పార్టీ బిజెపి( BJP ) కేటాయిస్తోందా అంటే సందేహమే. ఎందుకంటే ఉత్తరాదికి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తూ వస్తున్న ప్రధాని మోది ఏపీకి నిధులు భారీగా మంజూరు చేసేందుకు అవకాశం లేదు.
ఈ విషయంలో బిజెపి పెద్దలలో వైరం పెట్టుకున్నా కలిసి వచ్చేది ఏమీ ఉండకపోగా నష్టపోవాల్సి ఉంటుందనేది చంద్రబాబు . అందుకే ఈ విషయంలో ఆయన ఇంతగా టెన్షన్ పడుతున్నారు.