రిపోర్టింగ్ చేస్తూ నదిలో పడిపోయిన టీవీ జర్నలిస్టు.. చివరికి..?

అస్సాం( Assam )లో భారీ వర్షాలు, వరదల కారణంగా రోడ్లు జలమయమయ్యాయి.ఈ నేపథ్యంలో వివిధ ప్రాంతాలకు తిరుగుతూ జర్నలిస్టులు రిపోర్టింగ్ చేస్తున్నారు.

 The Tv Journalist Who Fell Into The River While Reporting.. In The End , Tv Repo-TeluguStop.com

ఈ క్రమంలోనే ఒక జర్నలిస్ట్ ( Journalist )రిపోర్టింగ్ చేస్తూ నదిలో పడ్డారు.ఆయన వరద పరిస్థితులను స్థానికంగా కవర్ చేస్తూ, నది ఒడ్డున నిలబడి రిపోర్టింగ్ మొదలుపెట్టారు.

అయితే, నేల తడిగా, మెత్తగా ఉంది అతని నిలబడ్డ భూమి ఒక్కసారిగా నదిలో పడిపోయింది.దీంతో జర్నలిస్ట్ కూడా పట్టు తప్పి నదిలో పడిపోయారు.

ఈ ఘటన మొత్తం కెమెరాలో రికార్డు అయింది.

జర్నలిస్ట్ స్వయంగా ఈదుతూ ఒడ్డుకు చేరుకున్నారు.స్థానికులు ఆయనకు సహాయం చేశారు.ఈ ఘటనకు సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

వీడియోలో, జర్నలిస్ట్ కెమెరా ముందు నిలబడి, వరదల పరిస్థితులను వివరిస్తున్నారు.అయితే, ఆయన మాట్లాడుతున్న సమయంలోనే, కాలు జారి నదిలో పడిపోతారు.

ప్రాణాపాయమైతే తప్పింది.ఈ ఘటన వరదల తీవ్రతను తెలియజేస్తుంది.

వర్షాలు కారణంగా నీట మునిగిన రోడ్లు, నదులు ప్రమాదకరంగా మారాయి.

ఈ వీడియోను చూసిన నెటిజన్లు జర్నలిస్ట్ ధైర్యాన్ని అభినందిస్తున్నారు.అదే సమయంలో, వరద బాధితులకు సహాయం చేయాలని ప్రభుత్వాన్ని కోరుతున్నారు.మరోవైపు అస్సాంలో ఈ ఏడాది భారీ వర్షాలు( Heavy rains ) కురిశాయి.

దీంతో అనేక జిల్లాల్లో వరదలు సంభవించాయి.ANI నివేదిక ప్రకారం, వరదనీరు తగ్గుతున్నందున రాష్ట్రంలోని వరద పరిస్థితి కొంత మెరుగుపడింది.అయితే, 18 జిల్లాల్లో ఇంకా సుమారు 5.98 లక్షల మంది ప్రజలు వరద బాధితులుగా ఉన్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube