దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కించిన భారీ చిత్రం ‘బాహుబలి’.ఈ సినిమా ఆడియోను మొదట హైదరాబాద్ హైటెక్స్లో నిర్వహించాలని చిత్ర యూనిట్ సభ్యులు భావించారు.
అందుకోసం ఏర్పాట్లు కూడా ప్రారంభించారు.కాని అనూహ్యంగా ఈ సినిమా ఆడియోకు పోలీసులు అనుమతి ఇవ్వలేదు.
ఆ తర్వాత రామోజీ ఫిల్మ్ సిటీలో ఏర్పాటు చేయాలని భావించారు.అందుకు కూడా పోలీసులు ఏవో అవాంతరాలు చెప్పారని టాక్ వినిపిస్తోంది.
మొత్తానికి ‘బాహుబలి’ని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం టార్గెట్ చేసిందా అంటూ ప్రస్తుతం సోషల్ మీడియాలో చర్చ జరుగుతోంది.
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పెట్టిన ఇబ్బందుల వల్లే ఏకంగా ఆడియో వేడుకను తిరుపతికి షిప్ట్ చేసినట్లుగా సినీ వర్గాల వారు చెవులు కొరుకుంటున్నారు.
అయితే ఈ విషయంపై చిత్ర యూనిట్ సభ్యులు మాత్రం మాట్లాడేందుకు ఆసక్తి చూపడం లేదు.ప్రభుత్వం అనుమతి ఇవ్వక పోవడం వల్లే ఈ సినిమా ఆడియోను అక్కడ విడుదల చేస్తున్నామని బహిరంగంగా ‘బాహుబలి’ టీం ప్రకటిస్తే ఆ తర్వాత సినిమా విడుదల సమయంలో మరిన్ని ఇబ్బందులు ఎదుర్కొవాల్సి వస్తుందనే ఉద్దేశ్యంతో ఈ విషయంపై మౌనంగా ఉంటున్నట్లుగా తెలుస్తోంది.
ఇక ఎన్నికల సమయంలో రాజమౌళి తెలంగాణకు వ్యతిరేకి అయిన జయప్రకాష్ నారాయణ్కు మద్దతు తెలిపాడు.అందుకే ఇప్పుడు కేసీఆర్ ప్రభుత్వం ఇలా కక్ష సాధిస్తుందా అనే అనుమానాలు కూడా వస్తున్నాయి.