గంజి వాగుపై బ్రిడ్జి నిర్మాణాన్ని త్వరితగతిన పూర్తి చేయాలి

పనుల పరిశీలనలో కలెక్టర్ సందీప్ కుమార్ ఝా బోయినపల్లి జడ్పీ స్కూల్ భవనం, పీహెచ్ సీ తనిఖీ రాజన్న సిరిసిల్ల జిల్లా బోయినపల్లి నుంచి వేములవాడ రోడ్డులో గంజి వాగుపై బ్రిడ్జి నిర్మాణాన్ని త్వరితగతిన పూర్తి చేయాలని సంబంధిత అధికారులను కలెక్టర్ సందీప్ కుమార్ ఝా ఆదేశించారు.గంజి వాగుపై బ్రిడ్జి నిర్మాణ పనులను కలెక్టర్ గురువారం ఆకస్మికంగా తనిఖీ చేశారు.

 The Construction Of The Bridge Over Ganji Vagu Should Be Completed As Soon As Po-TeluguStop.com

పనులు ఎక్కడి దాకా పూర్తి అయ్యాయో పరిశీలించి, అధికారులకు పలు సూచనలు చేశారు.అక్కడి నుంచి నేరుగా బోయినపల్లిలోని జిల్లా పరిషత్ పాఠశాల భవనంలో తరగతి గదులు, టాయిలెట్స్ తదితర పనులు పరిశీలించి, కావాల్సిన మరమ్మత్తులను వెంటనే చేపట్టి పూర్తి చేయాలని డీఈఓ రమేష్ కుమార్ ను ఆదేశించారు.

నూతన విద్యాలయాన్ని అక్కడికి తరలించి, అందుబాటులోకి తీసుకురావాలని సూచించారు.అనంతరం బోయినపల్లి ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని తనిఖీ చేశారు.

రక్త పరీక్షల గది, ఫార్మసీ గది, లేబర్ రూం పరిశీలించారు.అనంతరం ఓపీ రిజిస్టర్ తనిఖీ చేసి, ఎంత మంది రోగులు వచ్చారు? ఎందరికి రక్త పరీక్షలు చేశారని డాక్టర్ ను అడిగి తెలుసుకున్నారు.ఉదయం 10 గంటల వరకు 11 మంది రాగా, ఒకరికి రక్త పరీక్ష చేసినట్లు కలెక్టర్ దృష్టికి డాక్టర్ తీసుకెళ్లారు.మందులు, టెస్ట్ కిట్లు, సిబ్బంది వివరాలు తెలుసుకున్నారు.

ఇక్కడ జిల్లా పరిషత్ సీఈఓ వినోద్, ఎంపీడీఓ జయశీల, వైద్యాధికారి రేణుక తదితరులు పాల్గొన్నారు

.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube