టాలీవుడ్ మెగా హీరో రామ్ చరణ్( Ram charan )గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు.రామ్ చరణ్ ప్రస్తుతం వరసగా సినిమాలలో నటిస్తూ బిజీ బిజీగా గడుపుతున్న విషయం తెలిసిందే.
గత ఏడాది విడుదల అయినా ఆర్ఆర్ఆర్ సినిమాతో ప్రేక్షకులను పలకరించిన రామ్ చరణ్ ఈ సినిమాతో గ్లోబల్ స్టార్ గా గుర్తింపు తెచ్చుకున్న విషయం తెలిసిందే.ఒక సినిమాతో పాన్ ఇండియా హీరోగా మారడంతో పాటు ప్రపంచ వ్యాప్తంగా చాలా దేశాలలో భారీగా క్రేజ్ ను ఏర్పరచుకున్నారు.
కాగా రామ్ చరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంలో రూపొందుతున్న గేమ్ ఛేంజర్ సినిమాలో నటిస్తూ బిజీ బిజీగా ఉన్న విషయం తెలిసిందే.
ఇందులో బాలీవుడ్ బ్యూటీ కియారా అద్వానీ హీరోయిన్గా నటిస్తోంది.ఈ సినిమా ఎప్పుడెప్పుడు విడుదల అవుతుందా అని అభిమానులు ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్నారు.దానికి తోడు రామ్ చరణ్ పాన్ ఇండియా హీరోగా మారిన తర్వాత వస్తున్న మొట్టమొదటి సినిమా కావడంతో ఈ సినిమాపై అంచనాలు మరింత పెరిగాయి.
ఇది ఇలా ఉంటే తాజాగా సోషల్ మీడియాలో చెర్రీకి సంబంధించి ఒక ఆసక్తికర వార్త వైరల్ అవుతోంది.అదేమిటంటే స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ బయోపిక్( Virat kohli biopic ) లో రామ్ చరణ్ నటించబోతున్నట్లు వార్తలు జోరుగా వినిపిస్తున్నాయి.
ఈ మేరకు బాలీవుడ్( Bollywood ) లో ఒక బడా నిర్మాణ సంస్థ ప్రణాళికలు కూడా సిద్ధం చేసుకుని చెర్రీ వద్దకు కథ పంపినట్లుగా తెలుస్తోంది.నిజానికి ఆర్ఆర్ఆర్ సినిమాని బాలీవుడ్ లో ప్రమోట్ చేస్తున్న సమయంలో రామ్ చరణ్ తేజ, విరాట్ కోహ్లీ తనకు ఆదర్శమని చెప్పుకొచ్చాడు.విరాట్ కోహ్లీ బయోపిక్ లో నటించే అవకాశం వస్తే అసలు వదులుకోనని కూడా ఆయన తెలిపారు.ఆయన చేసిన కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ అయిన విషయం తెలిసిందే.
నిజానికి విరాట్ కోహ్లీకి రాంచరణ్ కి పోలికలు కూడా ఉంటాయని వారిద్దరి అభిమానులు భావిస్తూ ఉంటారు.అలాంటి విరాట్ కోహ్లీ బయోపిక్ లో రామ్ చరణ్ నటిస్తే ఆ సినిమా ఒక బ్లాక్ బస్టర్ హిట్ కావడం ఖాయం అని అంటున్నారు.