జనసేన అధినేత పవన్ కల్యాణ్ పై ఫిర్యాదును విజయవాడ సిటీ సివిల్ కోర్టు వెనక్కి పంపింది.పిటిషన్ పై విచారణ చేసే అధికారం కోర్టు పరిధిలోకి ఎలా వస్తుందో స్పష్టత ఇవ్వాలని న్యాయస్థానం ఆదేశాలు జారీ చేసింది.
పవన్ కల్యాణ్ వ్యాఖ్యలపై ఆధారాలు సమర్పించాలని కోర్టు ఆదేశాలు ఇచ్చింది.ఈ క్రమంలోనే ఫిర్యాదును ధర్మాసనం వెనక్కి పంపింది.
కాగా ఏలూరులో నిర్వహించిన వారాహి యాత్రలో భాగంగా వాలంటీర్ల పరువుకు భంగం కలిగించే విధంగా పవన్ వ్యాఖ్యలు చేశారని ఆరోపిస్తూ ఈ మేరకు ఐపీసీ సెక్షన్ 500, 504, 505 తదితర సెక్షన్ల కింద శిక్షించాలని కోరుతూ ఓ మహిళా వాలంటీర్ కోర్టులో ఫిర్యాదు దాఖలు చేసిన సంగతి తెలిసిందే.