సూపర్ స్టార్ మహేష్ బాబు ( Mahesh Babu ) లేటెస్ట్ గా నటిస్తున్న భారీ మాస్ యాక్షన్ మూవీ ”గుంటూరు కారం” (Guntur Kaaram) ఈ సినిమా జనవరిలో స్టార్ట్ అవ్వగా రెండు షెడ్యూల్స్ పూర్తి చేసుకుని సమ్మర్ ముందు వాయిదా పడిన విషయం తెలిసిందే.మరి అప్పుడు ఆగిపోయిన ఈ సినిమా గత కొన్ని రోజులే క్రితమే లాంగ్ గ్యాప్ తర్వాత షూట్ స్టార్ట్ చేసుకుంది.
మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్( Trivikram Srinivas ) దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా ఇటీవలే ఒక షెడ్యూల్ ముగించుకుంది.ఆ తర్వాత కొద్దీ గ్యాప్ తోనే మరో షెడ్యూల్ స్టార్ట్ చేసుకుని శరవేగంగా పూర్తి చేస్తున్నారు.అయితే జులై 10 నుండి ఈ షెడ్యూల్ లో భారీ మాస్ యాక్షన్ ఫైట్ ను చిత్రీకరిస్తారని టాక్.ఇక ఈ ఫైట్ ను కెజిఎఫ్ సినిమాలకు కంపోజ్ చేసిన అనల్ అరసు ఆధ్వర్యంలో చేయనున్నారని తెలుస్తుంది.
ఈ భారీ ఫైట్ సీన్( Guntur Karam Fight Scene ) అయిన దగ్గర నుండి మరింత వేగంగా షూట్ ముగించనున్నట్టు తెలుస్తుంది.ఇక ఈ సినిమా ఎప్పుడెప్పుడు పూర్తి అవుతుందా అని సూపర్ స్టార్ ఫ్యాన్స్ ఈగర్ గా ఎదురు చూస్తున్నారు.
ఇలానే షూట్ కు ఏ మాత్రం గ్యాప్ లేకుండా చేస్తే మాత్రం ఈ సినిమా అనుకున్న సమయానికే పూర్తి చేయవచ్చు.చూడాలి మరి మహేష్, త్రివిక్రమ్ ఏం చేస్తారో.
కాగా ఈ సినిమాలో శ్రీలీల ( SreeLeela ) హీరోయిన్ గా నటిస్తుండగా హారిక హాసిని బ్యానర్ పై ఎస్ రాధాకృష్ణ భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు.జగపతిబాబు విలన్ గా నటిస్తుండగా ప్రకాష్ రాజ్ కూడా కీలక పాత్రలో నటిస్తున్నాడు.ఇక థమన్ సంగీతం అందిస్తున్న ఈ సినిమా వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా జనవరి 13న రిలీజ్ కానుంది.