ముగ్గురు పిల్లలతో కలిసి తల్లి ఆత్మహత్య చేసుకున్న సంఘటన రాజన్న సిరిసిల్ల జిల్లాలో చోటుచేసుకున్నది.తల్లి తన పిల్లలు 14 నెలల బాలుడు ఉస్మాన్,5 సంవత్సరాల అసరజా( Asaraja ),7 ఏండ్ల వయస్సు గల అయాన్( Ayan ) లతో కలిసి బోయిన్పల్లి మండలం కుదురుపాక గ్రామం వద్ద మీడ్ మానేరులో దూకి ఆత్మహత్య చేసుకున్నారు.
సమాచారం తెలుసుకున్న పోలీసులు మృతదేహాలను వెలికితీశారు.తల్లి ముగ్గురు పిల్లలు ఆత్మహత్య వల్ల రాజన్న సిరిసిల్ల జిల్లాలో విషాదం చోటుచేసుకున్నది.
వారి ఆత్మహత్య పట్ల పోలీసులు విచారణ చేపట్టినట్లు సమాచారం.ఇంకా పూర్తి వివరాలు తెలియాల్సి ఉన్నది.