సినిమాల ద్వారా, జబర్దస్త్ షో ( Jabardasth Show )ద్వారా ఊహించని స్థాయిలో పాపులారిటీని సంపాదించుకున్న వేణు( Venu ) బలగం సినిమాతో దర్శకునిగా మారిన సంగతి తెలిసిందే.ఈ సినిమా తెలంగాణ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కగా అంచనాలను మించి సక్సెస్ సాధించింది.3 కోట్ల రూపాయల బడ్జెట్ తో తెరకెక్కిన ఈ మూవీ కలెక్షన్ల విషయంలో కూడా రికార్డులు క్రియేట్ చేసిన సంగతి తెలిసిందే.అయితే ప్రస్తుతం వేణు మాలలో కనిపిస్తున్నారు.
నవ్వినోళ్ల నోర్లు మూయించి డైరెక్టర్ గా ఒక మెట్టు పైకి ఎదిగిన వేణు బలగం సినిమా( Balagam ) సక్సెస్ సాధించడంతో మాల వేసుకున్నాడని కొంతమంది కామెంట్ చేస్తుండగా బలగం సినిమా ద్వారా వచ్చిన కామెంట్లకు పొంగిపోయి గర్వపడకుండా తనను తాను కంట్రోల్ లో ఉంచుకోవడానికే మాల వేసుకున్నాడని మరి కొందరు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.ఇండస్ట్రీలో సక్సెస్ ఫెయిల్యూర్ కు అతీతంగా కెరీర్ ను కొనసాగిస్తే మంచిది.

మనస్సును కంట్రోల్ లో పెట్టుకోవడానికి వేణు మాల వేసుకున్నాడని ఆయన సన్నిహితులు సైతం అభిప్రాయం వ్యక్తం చేస్తుండటం గమనార్హం.బలగం తరహా కథ, కథనంతో ఉన్న సినిమాలను వేణు తెరకెక్కించాలని మరి కొందరు అభిప్రాయం వ్యక్తం చేస్తుండటం గమనార్హం.దిల్ రాజు సొంత బ్యానర్ లోనే వేణు తర్వాత ప్రాజెక్ట్ లు కూడా తెరకెక్కుతాయేమో చూడాల్సి ఉంది.

వేణు రెమ్యునరేషన్ కూడా భారీగా పెరిగిందని ఆయన అడిగినంత రెమ్యునరేషన్ ఇవ్వడానికి నిర్మాతలు సిద్ధంగా ఉన్నారని సమాచారం అందుతోంది. వేణు కెరీర్ పరంగా ఎలాంటి పొరపాట్లు జరగకుండా జాగ్రత్తగా అడుగులు వేస్తున్నారు.మరోవైపు వేణు నటనకు గుడ్ బై చెప్పినట్టేనని కొంతమంది కామెంట్లు చేస్తుండగా ఆ కామెంట్లు సైతం హాట్ టాపిక్ అవుతున్నాయి.
వేణు బాక్సాఫీస్ వద్ద ఎన్నో సంచలనాలు సృష్టించడంతో పాటు మరింత మంచి పేరు తెచ్చుకోవాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు.







