సూర్యాపేట జిల్లాలో కాంగ్రెస్ సీనియర్ నేతల మధ్య వర్గ విభేదాలు బయట పడ్డాయి.ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, మాజీ మంత్రి దామోదర్ రెడ్డి మధ్య వార్ కొనసాగుతున్నట్లు తెలుస్తోంది.
అయితే ఇటీవల కురిసిన వర్షాల నేపథ్యంలో నష్టపోయిన రైతులను ఆదుకోవాలంటూ కాంగ్రెస్ తిరుమలగిరిలో దీక్ష చేపట్టిన విషయం తెలిసిందే.ఈ క్రమంలో దీక్షా శిబిరం వద్ద కోమటిరెడ్డి వెంకట్రెడ్డి ఫ్లెక్సీలను భారీగా ఏర్పాటు చేశారు.
కోమటిరెడ్డి ఫ్లెక్సీలను దామోదర్ రెడ్డి వర్గానికి చెందిన వ్యక్తులు చింపివేశారని తెలుస్తోంది.దీంతో రెండు వర్గాల మధ్య వివాదం రాజుకుందని సమాచారం.