రాజ్యాంగ బద్ధమైన పదవిలో కొనసాగిన తర్వాత రాజకీయాల్లోకి రావడం సరైంది కాదని మాజీ ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు అన్నారు.ఇటీవల పదవీ విరమణ చేసిన ఆయనకు.
రాజకీయ, వ్యాపార, సినీ, కళ తదితర రంగాలలోని ఆయన మిత్రుల ఆత్మీయ సమావేశం నార్సింగిలోని ఓ కన్వెన్షన్ హాల్ లో నిర్వహించారు.ఈ క్రమంలో ఆయన మాట్లాడుతూ.
ఇకపై ప్రజా జీవితంలోనే కొనసాగుతానన్నారు.తనకు తెలిసిన, తెలుసుకున్న విషయాలను ఎప్పటికప్పుడు యువత, రైతులతో పంచుకుంటానని చెప్పారు.
రాజకీయ నేతలు ఇతరులకు ఆదర్శంగా ఉండాలని సూచించారు.అదేవిధంగా చట్టసభల్లో చర్చలు వాడీవేడిగా జరగాలి తప్ప వ్యక్తిగత దూషణలతో కాదని చెప్పారు.