బీజేపీ "ప్రజాగ్రహ" సభపై సజ్జల రామకృష్ణారెడ్డి సీరియస్ కామెంట్స్...!!

ఏపీ బీజేపీ నిన్న విజయవాడలో నిర్వహించిన ప్రజా గ్రహ సభ రాజకీయంగా పెను దుమారాన్ని రేపుతోంది.ఏపీ బీజేపీ నేతలు పలువురు కేంద్రానికి చెందిన వాళ్ళు పాల్గొనడం జరిగింది.

 Sajjala Ramakrishna Reddy Serious Comments On Vijaywada Bjp Meeting Sajjala Rama-TeluguStop.com

వైసీపీ పార్టీ నాయకులను ఉద్దేశించి తీవ్రస్థాయిలో ఏపీ బీజేపీ నేతలు కామెంట్ చేశారు. కేంద్ర మంత్రి ప్రకాష్ జవదేకర్ ఏపీలో బెయిల్ పై ఉన్న నేతలు ఏ క్షణంలోనైనా… బెయిల్ క్యాన్సిల్ అయి జైలుకు వెళ్లొచ్చు.

.అని స్పష్టం చేశారు.దీంతో రాజకీయంగా “ప్రజాగ్రహ” సభ ఏపీలో సంచలనం సృష్టిస్తోంది.ఈ క్రమంలో వైసిపి పార్టీ కీలక నేత సజ్జల రామకృష్ణారెడ్డి “ప్రజా గ్రహా” సభ పై మండిపడ్డారు.

-Telugu Political News

బీజేపీలో ఉన్న టీడీపీ ఏజంట్లే ఈ సభను ఏర్పాటు చేయడం జరిగిందని.దీని వెనక ఉన్నది చంద్రబాబేనని ఆరోపించారు.మామూలుగా ఏపీలో బీజేపీ క్రియాశీలకంగా పని చేసిన సందర్భాలు లేవు కానీ ఎప్పుడైతే టిడిపి నుండి బీజేపీ లోకి కొంతమంది వెళ్లారో వాళ్ల వల్ల క్రియాశీలకంగా ఈ విధంగా బిజెపి రాణిస్తుందని సజ్జల అన్నారు.ఒక్క బిజెపిలో మాత్రమే కాదు జనసేన పార్టీలో కూడా చక్రం తిప్పుతూ ఉంది టిడిపికి చెందిన వాళ్లే అని చెప్పుకొచ్చారు.

రాజకీయంగా టిడిపి ఏ పాట పాడితే… అదే పాట రాగం బిజెపి జనసేన పార్టీలు అందుకు ఉంటాయని సజ్జల ఎద్దేవా చేశారు.రామ రాజ్యం కావాలంటే వైసీపీ అనుసరించాలని… సీఎం జగన్ ఆధ్వర్యంలో ఏపీలో రామ రాజ్యం నడుస్తోందని హితవు పలికారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube