ప్రస్తుతం భారతదేశంలో కరోనా వైరస్ పరిస్థితి ఏ విధంగా ఉందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.ఇలాంటి పరిస్థితుల మధ్య తాజాగా ఐపీఎల్ యాజమాన్యం ఓ కీలక నిర్ణయాన్ని తీసుకుంది.
గత మూడు రోజుల నుంచి ఐపీఎల్ లో కరోనా కేసులు మరింత ఎక్కువ కావడంతో ఐపీఎల్ యాజమాన్యం ఓ కీలక నిర్ణయాన్ని తీసుకుంది.వివిధ జట్ల లలోని కీలక ఆటగాళ్లకు కరోనా సోకడంతో ఐపీఎల్ 14 సీజన్ ను నిరవధికంగా వాయిదా వేస్తున్నట్లు ఐపీఎల్ ఛైర్మన్ రాజీవ్ శుక్లా దీనిపై ఓ ప్రకటనను తాజాగా విడుదల చేశారు.
ఓవైపు దేశంలో రోజురోజుకీ కరోనా వైరస్ తీవ్రరూపం దాలుస్తున్న సరే ఐపీఎల్ యాజమాన్యం ఐపీఎల్ మ్యాచ్ లను ఎంతో జాగ్రత్తగా లో ఆటగాళ్లను ఉంచి మ్యాచ్లను నిర్వహిస్తున్న సంగతి అందరికీ తెలిసిందే.ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా సరే ఐపీఎల్ లో ఉన్న వివిధ జట్ల ఆటగాళ్లకు కరోనా సోకడంతో ఈ నిర్ణయాన్ని తీసుకున్నట్లు అర్థమవుతుంది.
ఒకవైపు ఆటగాళ్లకు కరోనా సోకిన సీజన్ జరుగుతే ముందు ముందు అనేక ఆటంకాలు నడుమ ఇబ్బందులు ఎదుర్కొనే సమస్య ఉంటుందన్న నేపథ్యంలో ముందుగా ఐపీఎల్ సీజన్ ను నిరవధిక వాయిదా వేయడం మంచిదని భావించి ఈ నిర్ణయం తీసుకున్నట్లుతెలుస్తోంది.
అయితే పరిస్థితులు సద్దుమణిగిన తరువాత ముందు షెడ్యూల్ ని యధాతదంగా ఎలాంటి మార్పులు లేకుండా కొనసాగిస్తారని తెలుస్తోంది.తాజాగా సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టు ఆటగాడు వృద్ధిమాన్ సాహా కూడా కరోనా బారిన పడ్డాడు.ఈ విషయం క్రికెట్ అభిమానులకు కాస్త చేదు వార్త అని చెప్పవచ్చు ఏదేమైనా ఆటగాళ్ళందరూ నిర్ణీత సమయంలో కోలుకోవాలని కోరుకుందాం.