రేవంత్ సభలకు కార్యకర్తలు వెళ్ళొద్దన్న ఉత్తమ్.. అసలు కారణం ఇదే

ప్రస్తుతం కాంగ్రెస్ ఎంత బలహీనంగా ఉందో మనకు తెలిసిందే.ఇప్పుడున్న పరిస్థితులలో కాంగ్రెస్ పార్టీని ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లలేకపోతే ఇక ప్రజల్లో కాంగ్రెస్ మరింత బలహీనమయ్యే అవకాశం ఉంది.

 Congress Senior Leaders Complaint To Uttam Kumar Against Revanth Reddy, T Revant-TeluguStop.com

అయితే ప్రస్తుత పరిస్థితులలో రేవంత్ రెడ్డి రాజీవ్ రైతు భరోసా పేరిట పాదయాత్ర కొనసాగిస్తున్నాడు.అయితే తాజాగా ఈ వ్యవహారంపై ఉత్తమ్ చేసిన వ్యాఖ్యలు పెద్ద దుమారాన్నే రేపాయి.

రేవంత్ సభలకు కాంగ్రెస్ కార్యకర్తలు ఎవరు వెళ్లవద్దని హుకుం జారీ చేసినట్టు సమాచారం.దీనికి అసలు కారణం ఏమని మనం ఒకసారి పరిశీలిస్తే కాంగ్రెస్ సీనియర్ లు రేవంత్ రెడ్డి తన నియోజకవర్గం పరిధిలో కాకుండా ఇతర కాంగ్రెస్ నేతల నియోజకవర్గాలలో కూడా పాదయాత్ర చేస్తున్నాడని కాంగ్రెస్ సీనియర్లు ఉత్తమ్ కు ఫిర్యాదు చేసారు.

ఇప్పుడు ఉత్తమ్ ఇచ్చిన ఈ ఆదేశాలు పెద్ద దుమారాన్ని రేపుతున్నాయి.కష్ట కాలంలో ఉన్న కాంగ్రెస్ ను గాడిన పెట్టడానికి ప్రయత్నిస్తున్న రేవంత్ రెడ్డిని సీనియర్లు ఇలా అడ్డుకోవడం కాంగ్రెస్ కు నష్టం కలుగుతుందని చెప్పకతప్పదు.

ఇలాంటి ఘటనల వల్లే కాంగ్రెస్ పార్టీలో ఐక్యత ఉండదని, గ్రూపు రాజకీయాలు ఎక్కువగా ఉంటాయని ప్రజల్లో బలంగా నాటుకు పోయింది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube