బుల్లితెర టీవీ సీరియల్స్ లో ప్రసారమయ్యే సీరియల్ లో టాప్ వన్ లో ఉన్న కార్తీకదీపం సీరియల్ కు ఎంతో మంది అభిమానులు ఉన్నారు.స్టార్ మా లో ప్రసారమయ్యే ఏ సీరియల్ కు, ఎలాంటి షో లకు లేని రేటింగ్స్ కార్తీకదీపం సంపాదించుకుంది.
ఈ సీరియల్ కు ఇంత ప్రాధాన్యత రావడానికి గల కారణం ఈ సీరియల్ లో నటించే పాత్రలకు వారి నటనకు ఉన్న ప్రాధాన్యత అని చెప్పవచ్చు.ముఖ్యంగా ఈ సీరియల్ లో నటించే దీప అలియాస్ వంటలక్క పాత్రలో నటిస్తున్న ప్రేమి విశ్వనాథ్ కి రెండు తెలుగు రాష్ట్రాలలో ఎంతోమంది అభిమానులు ఉన్నారు.
కార్తీకదీపం సీరియల్ కు కేవలం సాధారణ ప్రజలే కాకుండా సెలబ్రిటీలు సైతం ఎంతో ఆసక్తిగా ఈ సీరియల్ ఫాలో అవుతుంటారు.ఈ సీరియల్ లో నటించే ప్రేమి విశ్వనాథ్ ఎప్పుడు సోషల్ మీడియ లో ఎంతో యాక్టివ్ గా ఉంటారు.ఈ సీరియల్ కు సంబంధించిన కొన్ని ఫోటోలను సోషల్ మీడియా ద్వారా షేర్ చేస్తూ తన అభిమానులను అలరిస్తున్నారు.తాజాగా ప్రేమి విశ్వనాథ్ ఒక ఫోటోను సోషల్ మీడియా ద్వారా షేర్ చేశారు.
ఈ ఫోటో లో దీపతో పాటు సీరియల్ లో నటించే హిమ, మురళీకృష్ణ ఉన్నారు.
ప్రస్తుతం ఈ ఫోటో కార్తీకదీపం అభిమానులను ఎంతగానో ఆకట్టుకుంది.అయితే ఈ ఫోటోను చూసిన ఓ అభిమాని పెట్టిన కామెంట్ ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది.ఈ ఫోటో చూసిన శ్రీవిద్య అనే అభిమాని సిస్టర్ మీరు చాలా బాగున్నారు అంటూ ఎమోజీలు పెట్టింది.
కానీ ప్రస్తుతం సీరియల్ మాత్రం ఎంతో బోరింగ్ అంటూ మెసేజ్ చేయడం ప్రస్తుతం హాట్ టాపిక్ గా మారింది.కానీ నిజానికి ప్రస్తుతం కార్తీకదీపం సీరియల్ ఎంతో ఆసక్తికరంగా కొనసాగుతోంది.
దీప తనపై పడిన నిందను చెప్పడం కోసం మొనితను టార్గెట్ చేస్తూ క్షణక్షణం ఎంతో ఆసక్తిని రేకెత్తిస్తోంది.