కేజీఎఫ్‌ దర్శకుడికి బిస్కట్స్‌ వేస్తున్న తెలుగు ఫిల్మ్‌ మేకర్స్‌

నేడు కేజీఎఫ్‌ చిత్ర దర్శకుడు ప్రశాంత్‌ నీల్‌ పుట్టిన రోజు.ఈ సందర్బంగా కర్ణాటకలో సందడి వాతావరణం కనిపించడం చాలా కామన్‌ విషయం.

 Prashanth Neel,mythri Movie Makers, Social Media, Telugu Filmmakers-TeluguStop.com

కన్నడ సోషల్‌ మీడియా జనాలు శుభాకాంక్షలతో ముంచెతుతున్నారు.కాని ఈ సమయంలో తెలుగు ఫిల్మ్‌ మేకర్స్‌ కూడా ఆయనపై శుభాకాంక్షలు కురిపించడం జరుగుతోంది.

గతంలో ఏ దర్శకుడికి కూడా జరగని విధంగా ఈ దర్శకుడి విషయంలో జరుగుతుంది.హీరో లెవల్‌లో ప్రశాంత్‌ నీల్‌కు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు.
మైత్రి మూవీస్‌ మేకర్స్‌లో ప్రశాంత్‌ నీల్‌ ఒక సినిమా చేయబోతున్నాడు అంటూ చాలా రోజులుగా వార్తలు వస్తున్నాయి.ఆ విషయంలో క్లారిటీ అయితే రాలేదు.కాని సోషల్‌ మీడియా పోస్ట్‌ల ద్వారా ఆ వార్తలను నిర్థారణ చేస్తున్నారు.తాజాగా సోషల్‌ మీడియాలో మైత్రి మూవీస్‌ తో పాటు డివివి సినిమా ఇంకా కొన్ని నిర్మాణ సంస్థలు నిర్మాతలు కూడా ప్రశాంత్‌ నీల్‌కు శుభాకాంక్షలు తెలియజేశారు.
ప్రశాంత్‌ తదుపరి చిత్రాన్ని మైత్రి వారు నిర్మిస్తున్నారు కనుక వారు శుభాకాంక్షలు చెబుతూ పోస్ట్‌ పెట్టడం సరే కాని డివివి బ్యానర్‌ పోస్ట్‌ పెట్టడం వెనుక ఉద్దేశ్యం ఏంటీ అంటూ నెటిజన్స్‌ అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.మైత్రి మూవీస్‌ సినిమా తర్వాత ప్రశాంత్‌ నీల్‌తో దానయ్య సినిమా చేయబోతున్నాడా.

ప్రశాంత్‌నీల్‌, ఎన్టీఆర్‌ల కాంబో మూవీ హిట్‌ అయితే వరుసగా తెలుగులోనే ఆయన సినిమాలు ఉండే అవకాశం ఉంది.అందుకే ఇప్పటి నుండే ఆయనకు నిర్మాతలు బిస్కట్స్‌ వేస్తున్నారు అనే గుసగుసలు వినిపిస్తున్నాయి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube