జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఇటీవల వైజాగ్లో నిర్వహించిన లాంగ్ మార్చ్లో ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించిన విషయం తెల్సిందే.సీఎం జగన్తో పాటు మంత్రి కన్నబాబుపై సంచలన ఆరోపణలు చేశాడు.
ఇసుక కొరత కారణంగా భవన నిర్మాణ కార్మికులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నా కూడా ముఖ్యమంత్రి లేదా మంత్రులు ఎవరు కూడా ఏమాత్రం స్పందించడం లేదు అంటూ పవన్ అన్నాడు.కన్నబాబును మేము రాజకీయాల్లోకి తీసుకు వచ్చానంటూ పవన్ వ్యాఖ్యలు చేయడంతో మంత్రి కన్నబాబు సీరియస్ అయ్యాడు.
తనపై పవన్ చేసిన వ్యాఖ్యలకు కన్నబాబు సీరియస్గా స్పందించాడు.అధికారంలో ఉన్నా లేకున్నా జగన్నే పవన్ ఎందుకు టార్గెట్ చేసి మాట్లాడుతున్నాడు అంటూ మంత్రి ప్రశ్నించాడు.నా రాజకీయ జీవితంలో ఎలాంటి దాపరికం లేదు.నేను చిరంజీవి గారి వల్లే రాజకీయాల్లోకి వచ్చాను.
ఇప్పటికి ఆ విషయాన్ని నేను చెప్పుకుంటాను, ఆయనకు రుణపడి ఉంటాను.కాని నువ్వు చిరంజీవి వల్ల రాజకీయాల్లోకి వచ్చాను అంటూ ఎప్పుడైనా చెప్పుకున్నావా, నీ అన్నను ఎప్పుడైనా గౌరవించుకున్నావా అంటూ ప్రశ్నించాడు.
నీకు నా గురించి సీఎం జగన్ గురించి మాట్లాడే అర్హత లేదు అంటూ ఆగ్రహం వ్యక్తం చేశాడు.