అమెరికాలో మరో సారి కాల్పులు కలకలం సృష్టించాయి.సరిగ్గా రెండు రోజుల క్రితం అమెరికాలో ఓ యూదుల ప్రార్ధనా మందిరంలో ఓ దుండగు చేరి ఒక్కసారిగా కాల్పులు జరిపిన సంఘటన అందరికి తెలిసిందే.
అయితే ఘటనలో ఒకరు మృతిచెందగా మరికొందరు గాయపడ్డారు.ఈ ఘటన మరువక ముందేమరో కాల్పుల ఘటన అమెరికాలో చోటు చేసుకుంది.
మేరీ ల్యాండ్ రాష్ట్రంలోని వెస్ట్బాల్టిమోర్లో బయట గుంపుగా కూర్చున్న జనంపై ఒక్క సారిగా ఓ ఆగంతకుడు వచ్చి కాల్పులకి తెగబడ్డాడు.
ఆరు బయట గూమిగూడిన జనంపైకి ఓ సాయుధుడు కాల్పులు జరిపాడు.
ఈ ఘటనలో ఒకరు మృతి చెందగా, ఏడుగురు గాయపడ్డారు.అయితే రెండు చోట్ల తూటాలు కనపడటంతో ఇద్దరు సాయుధులు కాల్పులకి పాల్పడి ఉండవచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు.
కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపడుతున్నాడు.అమెరికాలో వరుసగా కాల్పుల ఘటనలు జరగడంతో అమెరికా ప్రజలు బయటకి వెళ్ళాలంటేనే భయపడిపోతున్నారు.