ఎన్‌కౌంటర్ చేసినా భయం లేదు

మన దేశంలో నేరాల దారి నేరాలదే, శిక్షల దారి శిక్షలదే.జైలు శిక్షలకే కాదు, ఎన్‌కౌంటర్ చేసినా భయపడని కరడు గట్టిన వారు ఉన్నారు.

 20 Red Sanders Woodcutters Arrested In Ap-TeluguStop.com

ఉరిశిక్షలు పడినా ఖాతరు చేయరు.ఇందుకు తాజా ఉదాహరణ ఎర్ర చందనం దొంగలు.

ఎపీలోని శేషాచలం కొండల్లో కొన్ని రోజుల క్రితం అంటే ఈ ఏడాది ఏప్రిల్ నెలలో శేషాచలం అడవుల్లో 20 మంది ఎర్రచందనం దొంగలను ఎన్‌కౌంటర్ చేసిన సంగతి ఇంకా ఎవరు మర్చిపోలేదు.అయినా అక్కడ ఎర్ర చందనం దుంగలను నరికి స్మగ్లింగ్ చేస్తూనే ఉన్నారు.

ఎపీలోని ఇతర జిల్లాల నుంచి కూడా ఎర్రచందనం తరలి పోతూనే ఉంది.తాజాగా 23 ఎర్రచందనం దుంగలను రవాణా చేస్తున్న 20 మందిని కడప జిల్లా రైల్వే కోడూర్ మండలంలో పట్టుకున్నారు.

అక్కడి అడవుల నుంచి ఈ దుంగలను తరలిస్తుంటే పోలీసులు పట్టుకున్నారు.వీరంతా తమిళనాడుకు చెందినవారే.

శేషాచలం అడవుల్లో కూడా వీరే చందనం చెట్లు నరుకుతున్నారు.ఎన్‌కౌంటర్ లో చనిపోయిన వారంతా తమిళనాడుకు చెందినవారే.

రైల్వే కోడూర్ అడవుల్లో చెట్లు నరికిన వారు తమిళులే గాని దాన్ని పర్యవేక్షించిన వాడు విజయవాడకు చెందిన తెలుగోడు.ఎర్ర చందనం దొంగలకు అధికారుల అండ కూడా ఉంది.

వారి సహకారం లేనిదే అక్రమాలు సాగవు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube