మన దేశంలో నేరాల దారి నేరాలదే, శిక్షల దారి శిక్షలదే.జైలు శిక్షలకే కాదు, ఎన్కౌంటర్ చేసినా భయపడని కరడు గట్టిన వారు ఉన్నారు.
ఉరిశిక్షలు పడినా ఖాతరు చేయరు.ఇందుకు తాజా ఉదాహరణ ఎర్ర చందనం దొంగలు.
ఎపీలోని శేషాచలం కొండల్లో కొన్ని రోజుల క్రితం అంటే ఈ ఏడాది ఏప్రిల్ నెలలో శేషాచలం అడవుల్లో 20 మంది ఎర్రచందనం దొంగలను ఎన్కౌంటర్ చేసిన సంగతి ఇంకా ఎవరు మర్చిపోలేదు.అయినా అక్కడ ఎర్ర చందనం దుంగలను నరికి స్మగ్లింగ్ చేస్తూనే ఉన్నారు.
ఎపీలోని ఇతర జిల్లాల నుంచి కూడా ఎర్రచందనం తరలి పోతూనే ఉంది.తాజాగా 23 ఎర్రచందనం దుంగలను రవాణా చేస్తున్న 20 మందిని కడప జిల్లా రైల్వే కోడూర్ మండలంలో పట్టుకున్నారు.
అక్కడి అడవుల నుంచి ఈ దుంగలను తరలిస్తుంటే పోలీసులు పట్టుకున్నారు.వీరంతా తమిళనాడుకు చెందినవారే.
శేషాచలం అడవుల్లో కూడా వీరే చందనం చెట్లు నరుకుతున్నారు.ఎన్కౌంటర్ లో చనిపోయిన వారంతా తమిళనాడుకు చెందినవారే.
రైల్వే కోడూర్ అడవుల్లో చెట్లు నరికిన వారు తమిళులే గాని దాన్ని పర్యవేక్షించిన వాడు విజయవాడకు చెందిన తెలుగోడు.ఎర్ర చందనం దొంగలకు అధికారుల అండ కూడా ఉంది.
వారి సహకారం లేనిదే అక్రమాలు సాగవు.