ఓటర్ లిస్ట్ కు పీసీసీకి సంబంధం లేదు : రేవంత్ రెడ్డి

ఏఐసీసీ ఎన్నికల ప్రక్రియ ప్రజాస్వామ్య బద్దంగా జరిగిందని తెలంగాణ పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి తెలిపారు.ఓటర్ లిస్ట్ కు పీసీసీకి సంబంధం లేదు అని అన్నారు.

 Voter List Has Nothing To Do With Pcc: Revanth Reddy-TeluguStop.com

పైనుంచి వచ్చిన జాబితా ప్రకారమే ఓటింగ్ జరిగిందని తెలిపారు.తను ఒక ఓటర్ ను మాత్రమేనని.

తన ఓటు వేసుకున్నా అని అన్నారు.అంతా పిఆర్వో లే చూసుకున్నారని వెల్లడించారు.

అర్హత లేని వారికి ఓటు ఇచ్చారని భావిస్తే ఏఐసీసీ ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేయొచ్చని చెప్పారు.ఉప ఎన్నికలో ఫ్రీ సింబల్స్ ఇవ్వొద్దనే అధికారం ఎవరికీ లేదని అన్నారు.

ఎన్నికల గుర్తులపై టిఆర్ఎస్ కోర్టుకు వెళ్లడం అంటే ప్రజాస్వామ్య హక్కును కాలరాయడమేనని విమర్శించారు.అలాంటప్పుడు మీ గుర్తు మార్చుకుంటే సరిపోతుంది కదా అని అడిగారు.

కారు గుర్తు కూడా ఒకప్పుడు ఫ్రీ సింబలేనని గుర్తు చేశారు.ఫ్రీ సింబల్స్ ను బ్లాక్ చేయాలనడం రాజ్యాంగ విరుద్ధమని తెలిపారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube