ఓటర్ లిస్ట్ కు పీసీసీకి సంబంధం లేదు : రేవంత్ రెడ్డి

ఏఐసీసీ ఎన్నికల ప్రక్రియ ప్రజాస్వామ్య బద్దంగా జరిగిందని తెలంగాణ పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి తెలిపారు.

ఓటర్ లిస్ట్ కు పీసీసీకి సంబంధం లేదు అని అన్నారు.పైనుంచి వచ్చిన జాబితా ప్రకారమే ఓటింగ్ జరిగిందని తెలిపారు.

తను ఒక ఓటర్ ను మాత్రమేనని.తన ఓటు వేసుకున్నా అని అన్నారు.

అంతా పిఆర్వో లే చూసుకున్నారని వెల్లడించారు.అర్హత లేని వారికి ఓటు ఇచ్చారని భావిస్తే ఏఐసీసీ ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేయొచ్చని చెప్పారు.

ఉప ఎన్నికలో ఫ్రీ సింబల్స్ ఇవ్వొద్దనే అధికారం ఎవరికీ లేదని అన్నారు.ఎన్నికల గుర్తులపై టిఆర్ఎస్ కోర్టుకు వెళ్లడం అంటే ప్రజాస్వామ్య హక్కును కాలరాయడమేనని విమర్శించారు.

అలాంటప్పుడు మీ గుర్తు మార్చుకుంటే సరిపోతుంది కదా అని అడిగారు.కారు గుర్తు కూడా ఒకప్పుడు ఫ్రీ సింబలేనని గుర్తు చేశారు.

ఫ్రీ సింబల్స్ ను బ్లాక్ చేయాలనడం రాజ్యాంగ విరుద్ధమని తెలిపారు.

ఒకేసారి 14,000 మంది జాతీయ గీతం పాడితే ఎలా ఉంటుందో ఎప్పుడైనా విన్నారా..