ఏపీ హోం మంత్రి వైసీపీ నాయకురాలు సుచరిత టీడీపీ నేత అయ్యన్నపాత్రుడు పై తీవ్ర వ్యాఖ్యలు చేశారు.గంజాయి అమ్ముకునే అయ్యన్నపాత్రుడు సమాజానికి ప్రమాదకరమైన వ్యక్తి అని అన్నారు.
నోటికి ఇష్టం వచ్చినట్లు ఏది పడితే అది.అయ్యన్నపాత్రుడు మాట్లాడుతున్నారని మండిపడ్డారు.బూతులు మాట్లాడే .వ్యక్తి సంస్కారం గురించి మాట్లాడతారా.??, మేము అధికారంలోకి వచ్చిన వెంటనే మీ అంతు చూస్తామని మాట్లాడటం దారుణమని సుచరిత పేర్కొన్నారు.మహిళా అధికారులను ఉద్దేశించి అయ్యన్నపాత్రుడు ఇష్టానుసారంగా బూతులు గతంలో మాట్లాడారని .అటువంటి వ్యక్తి రాజకీయాలకు అనర్హుడు అని.అన్నారు.
ఇటువంటి దారుణమైన ప్రమాదకరమైన వ్యక్తి సమాజానికి చీడపురుగులు లాంటి వాడని.సుచరిత మండిపడ్డారు.ఆయన బ్యాక్ గ్రౌండ్ మొత్తం గమనిస్తే.మహిళలను గుడ్డలూడదీసి కొడతా., గంజాయి అమ్ముకునే.వ్యక్తి అని అన్నారు.
ఇటువంటి వారు.రాజీనామాలు కాదు శాశ్వతంగా రాజకీయాలకు దూరంగా ఉండాలని లేకపోతే సమాజానికి ప్రమాదకరమని సుచరిత సీరియస్ కామెంట్ చేశారు.
వాస్తవానికి తాను ప్రతిపక్షంలో ఉండే నాయకుల గురించి పెద్దగా స్పందించని మనస్తత్వం, కానీ అయ్యన్నపాత్రుడు దారుణమైన వ్యాఖ్యలు చేశారని సుచరిత తనదైన శైలిలో మీడియా సమక్షంలో కామెంట్లు చేశారు. ఒక్క సూచరిత మాత్రమే కాక వైసీపీ పార్టీలో మంత్రులు మరి కొంతమంది ప్రజాప్రతినిధులు సీఎం వైఎస్ జగన్ ని అయ్యన్నపాత్రుడు పరుష పదజాలంతో విమర్శించడాన్ని.
ఖండిస్తూ కౌంటర్లు వేస్తున్నారు.