విజయ్ దేవరకొండ హీరోగా డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాద్ దర్శకత్వంలో రూపొందుతున్న లైగర్ సినిమా చిత్రీకరణ గత ఏడాది నిలిచి పోయింది.కరోనా కారణంగా మార్చి నుండి ఇప్పటి వరకు షూటింగ్ పునః ప్రారంభం అయ్యిందే లేదు.
ఈ సినిమా చిత్రీకరణ కోసం రౌడీ ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.భారీ అంచనాల నడుమ రూపొందుతున్న ఈ సినిమా షూటింగ్ ను పునః ప్రారంభించేది ఎప్పుడు అంటూ అంతా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.
ఎట్టకేలకు ఈ సినిమా షూటింగ్ ను ప్రారంభించబోతున్నట్లుగా సమాచారం అందుతోంది.ముంబయిలో ఎక్కడ అయితే సినిమా షూటింగ్ ను నిలిపేశారో అక్కడే మళ్లీ పునః ప్రారంభించేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లుగా తెలుస్తోంది.
వచ్చే వారం ప్రారంభం కాబోతున్న షెడ్యూల్ లో విజయ్ దేవరకొండ మరియు అనన్య పాండే లు పాల్గొనబోతున్నారు.
ఛార్మి మరియు పూరి జగన్నాద్ తో పాటు ఈ సినిమా బాలీవుడ్ స్టార్ నిర్మాత అయిన కరణ్ జోహార్ కూడా నిర్మించబోతున్నాడు.
పాన్ ఇండియా మూవీగా రూపొందుతున్న ఈ సినిమా షూటింగ్ ను త్వరలోనే పూర్తి చేయాలని భావిస్తున్నారు.దర్శకుడు పూరి ఈ సినిమా ను మరీ ఇంత ఆలస్యం చేస్తున్న కారణం ఏంటీ అనే విషయంలో క్లారిటీ రావడం లేదు.
ఏది ఏమైనా ఇప్పటికి అయినా సినిమాను పునః ప్రారంభిస్తున్న కారణంగా విజయ్ దేవరకొండ అభిమానులు హ్యాపీగా ఉన్నారు.విజయ్ దేవరకొండ షూటింగ్ మొదలు పెడితే సినిమాను కేవలం రెండు నెలల్లోనే పూర్తి చేయగల సమర్థుడు.
అందుకే వెంటనే విజయ్ దేవరకొండ నుండి టీజర్ కూడా వచ్చే అవకాశాలున్నాయని అంటున్నారు.మహా శివరాత్రి స్పెషల్ గా ఖచ్చితంగా రౌడీ ఫ్యాన్స్ కోసం ట్రీట్ ను పూరి ఇస్తాడనే నమ్మకంను ఇండస్ట్రీ వర్గాల వారు వ్యక్తం చేస్తున్నారు.