2002 సంవత్సరంలో ఎన్టీఆర్ తో ఆది సినిమాను రూపొందించి స్టార్ దర్శకుడిగా గుర్తింపు దక్కించుకున్నాడు.తక్కువ సమయంలోనే ఎక్కువ సినిమాలు చేశాడు.
ఏడాదికి ఒకటి చొప్పున స్పీడ్ గా సినిమా లు చేయడం తో పాటు స్టార్ హీరోల సినిమా లకు దర్శకత్వం వహించే అవకాశం దక్కించుకున్నాడు.కానీ ఆయన కెరీర్ చాలా తక్కువ సమయంలోనే క్లోజ్ అయింది అనిపిస్తుంది.
పదేళ్ల పాటు బిజీగా కొనసాగిన వినాయక్ అల్లుడు శీను( Alludu Seenu ) తర్వాత స్లో అయ్యాడు.
చిరంజీవి ( Chiranjeevi )తో ఖైదీ నెం.150 సినిమా ( Khaidi No.150 )చేయడం తో మళ్లీ బిజీ అవుతాడని అంతా భావించారు.కానీ ఆ తర్వాత వచ్చిన ఇంటిలిజెంట్ సినిమా డిజాస్టర్ అవ్వడం తో మళ్లీ సినిమాకు చాలా సమయం తీసుకున్నాడు.
హిందీ లో చత్రపతి సినిమాను రీమేక్ చేసిన వినాయక్ ప్రస్తుతం కొత్త సినిమా కోసం ప్రయత్నాలు చేస్తున్నాడు.చత్రపతి ని హిందీ లో చేసి చాలా పెద్ద తప్పు చేశాడు అంటూ విమర్శలు వచ్చాయి.
అంతే కాకుండా ఆయన దర్శకత్వం లో సినిమా ను చేసేందుకు ఏ హీరో కూడా ఆసక్తి చూపించడం లేదు.
ఆ మధ్య సీనియర్ స్టార్ హీరో ఒకరు వినాయక్ ( V.V.Vinayak )తో సినిమా ను చేయాలని భావించాడు.కానీ చత్రపతి సినిమా ఫ్లాప్ అవ్వడంతో సైడ్ అయ్యాడని తెలుస్తోంది.
బాబోయ్ నీకో దండం అన్నట్లుగా ఆయన వినాయక్ కి మొహం చాటేశాడు అంటూ పుకార్లు షికార్లు చేస్తున్నాయి.యాక్షన్ చిత్రాల దర్శకుడిగా మంచి పేరు దక్కించుకున్న వినాయక్ అదే రేంజ్ లో మళ్లీ ఒక మంచి కథ ను రెడీ చేసుకుని మరీ సినిమా ను రూపొందించేందుకు గాను ప్రయత్నాలు చేస్తున్నాడు.
ఇద్దరు ముగ్గురు యంగ్ హీరోలకు ఇప్పటికే కథ ను వినిపించాడు.ప్రస్తుతం వారు వారి వారి సినిమా లతో బిజీగా ఉండటం వల్ల నో చెప్పారనే వార్తలు వస్తున్నాయి.
విశ్వసనీయంగా సమాచారం వినాయక్ ఏదో ఒకటి చేసి వచ్చే ఏడాది సినిమాను చేయాలని గట్టి ప్రయత్నాలు చేస్తున్నాడు.