ఎమ్మెల్సీ ఉప ఎన్నికలకు షెడ్యూల్ ఖరారు...!

నల్లగొండ జిల్లా:తెలంగాణలో ఖాళీ అయిన ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ స్థానాల ఉప ఎన్నిక కోసం కేంద్ర ఎన్నికల సంఘం గురువారం షెడ్యూల్‌ను విడుదల చేసింది.

బీఆర్ఎస్ ఎమ్మెల్సీలు కడియం శ్రీహరి, పాడి కౌశిక్ రెడ్డిలు( Kadiam Srihari, Padi Kaushik Reddy ) శాసనసభ ఎన్నికల్లో గెలుపొందడంతో తమ ఎమ్మెల్సీ పదవులకు రాజీనామా చేశారు.

దీంతో రెండు ఎమ్మెల్సీ స్థానాలు ఖాళీ అయ్యాయి.ఈ నేపథ్యంలో కేంద్ర ఎన్నికల సంఘం ఉప ఎన్నికలకు షెడ్యూల్‌ను ప్రకటించింది.

ఈ నెల 11వ తేదీన ఎన్నికల నోటిఫికేషన్ జారీ చేయనుంది.అదే రోజు నుంచి నామినేషన్ల స్వీకరణ ప్రారంభమవుతుంది.18వ తేదీన నామినేషన్ల గడువు ముగియనుంది.19వ తేదీన నామినేషన్ల పరిశీలన,22వ తేదీ వరకు నామినేషన్ల ఉప సంహరణకు గడువు ఇస్తారు.29వ తేదీన ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు పోలింగ్ నిర్వహిస్తారు.ఫిబ్రవరి 1వ తేదీన ఫలితాలు వెల్లడిస్తారని ఎన్నికల కమిషన్ ప్రకటించింది.

త్వరలో 1500 మంది టీచర్లకు పదోన్నతులు..?
Advertisement

Latest Nalgonda News