తెలంగాణ కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి హైకోర్టుకెక్కారు .అసలు తన మీద ఎన్ని క్రిమినల్ కేసులు ఉన్నయో వివరాలు కావాలంటూ రేవంత్ రెడ్డి హైకోర్టులో దాఖలు చేసిన పిటిషన్ ను కోర్టు విచారణకు స్వీకరించింది.
ఎన్నికల అఫిడవిట్లో క్రిమినల్ కేసుల వివరాలు పొందుపరిచే నిమిత్తం ఆర్టీఐని సమాచారం కోరగా వారి నుంచి ఎటువంటి సమాధానం లభించలేదని ఆయన పిటిషన్లో పేర్కొన్నారు.
అయితే తనను రాజకీయంగా ఇబ్బందులపాలు చేసేందుకు పోలీసులు అక్రమంగా క్రిమినల్ కేసులు పెడుతున్నారని పిటిషన్ లో పేర్కొన్నారు.ప్రతివాదులుగా తెలంగాణ డీజీపీ, ఆర్టీఐ కమిషనర్ ను చేర్చారు.కాగా రేవంత్ రెడ్డి పిటిషన్ను విచారణకు స్వీకరించిన హైకోర్టు తదుపరి విచారణను ఈ నెల 6 వ తేదీకి వాయిదా వేసింది.