యంగ్ హీరో అక్కినేని నాగచైతన్య ఇటీవల వరుసగా సెలెక్టివ్ చిత్రాలను చేస్తూ ప్రేక్షకులను ఆకట్టుకుంటోన్న సంగతి తెలిసిందే.కాగా తాజాగా ఆయన ఫీల్ గుడ్ చిత్రాల దర్శకుడు శేఖర్ కమ్ముల దర్శకత్వంలో ‘లవ్స్టోరి’ చిత్రంలో నటిస్తున్నాడు.
ఇక ఈ సినిమాను పూర్తి రొమాంటిక్ ఎంటర్టైనర్గా శేఖర్ కమ్ముల తెరకెక్కిస్తుండటంతో ఈ సినిమాపై మంచి అంచనాలు క్రియేట్ అయ్యాయి.కాగా తన నెక్ట్స్ మూవీని స్టార్ ప్రొడ్యూసర్ దిల్ రాజుతో కలిసి చేసేందుకు చైతూ రెడీ అయ్యాడు.
ఈ క్రమంలో ఈ సినిమాను మనం ఫేం దర్శకుడు విక్రమ్ కె కుమార్ దర్శకత్వంలో తెరకెక్కనున్నట్లు తెలుస్తోంది.అయితే ఈ సినిమాలో హీరోయిన్గా చైతూ సరసన రకుల్ ప్రీత్ సింగ్ నటిస్తోందనే వార్త ఇండస్ట్రీ వర్గాల్లో వినిపిస్తోంది.
కానీ ఈ వార్తలపై ఎలాంటి అఫీషియల్ క్లారిటీ లేదు.దీంతో ఈ సినిమాలో నిజంగానే రకుల్ నటిస్తుందా అని అందరూ ఆశ్చర్యానికి గురయ్యారు.కాగా తాజాగా ఈ సినిమాలో రకుల్ నటించడం లేదని తెలుస్తోంది.
ప్రస్తుతం రకుల్ ఫేడవుట్ అవుతుండటంతో ఆమెను ఈ సినిమాలో తీసుకునేందుకు చిత్ర యూనిట్ రెడీగా లేదని తెలుస్తోంది.
గతంలో చైతూ, రకుల్ కలిసి నటించిన ‘రారండోయ్ వేడుక చూద్దాం’ చిత్రం బాక్సాఫీస్ వద్ద మంచి విజయాన్ని అందుకుంది.కానీ ప్రేక్షకులకు వారిద్దరి మధ్య కెమిస్ట్రీ నచ్చలేదనే టాక్ ఇండస్ట్రీ వర్గాల్లో వినిపించింది.
దీంతో మరోసారి ఈ జోడీని తీసుకుని ప్రేక్షకుల్లో ఆసక్తి తగ్గించడం మంచిది కాదని చిత్ర యూనిట్ భావించింది.అందుకే ఈ సినిమాలో రకుల్ను కాదని వేరొక బ్యూటీని తీసుకునేందుకు చిత్ర యూనిట్ భావిస్తోంది.