ఆంధ్రప్రదేశ్లో రథసప్తమి వేడుకలకు వేగంగా ఏర్పాట్లు జరుగుతున్నాయి.రథసప్తమి అంటే ముఖ్యంగా ప్రత్యేక దైవం ఆరోగ్య ప్రదాత శ్రీ సూర్యనారాయణ స్వామి కరుణ కోసం చాలా రకాల పూజలు చేస్తూ ఉంటారు.
అంతేకాకుండా అలాంటి రథసప్తమి వేడుకలను పండుగ వాతావరణంలో ఘనంగా జరుపుకోవాలని శ్రీశైలం జిల్లా కలెక్టర్ శ్రీకేష్ లతాకర్ వెల్లడించారు.జనవరి 28వ తేదీన జరగనున్న రథసప్తమి వేడుకల ఏర్పాటులో భాగంగా బుధవారం అసరవల్లి మండపంలో జిల్లా కలెక్టర్ అధ్యక్షతన సమన్వయ సమావేశాన్ని నిర్వహించారు.
ఈ సమావేశంలో దర్శనం కోసం వచ్చే భక్తులకు అసరవల్లిలో ఎలాంటి అసౌకర్యం కలుగకుండా ఏర్పాట్లను చేయాలని జిల్లా కలెక్టర్, రెవిన్యూ, పోలీస్, రవాణా శాఖలకు ఆలయ ఈవో హరి సూర్య ప్రకాష్ రావు వెల్లడించారు.గత రెండున్నర సంవత్సరాలుగా కరోనా భయాలతో భక్తుల సంఖ్య భారీగా తగ్గింది.
కానీ ఈ సంవత్సరం భక్తులు భారీగా తరలివచ్చే అవకాశం ఉందని దేవాలయ అధికారులు అంచనాలు వేస్తున్నారు.

ఎంతమంది భక్తులు వచ్చినా వారికి ఎలాంటి అసౌకర్యం కలగకుండా అసరవల్లి రథసప్తమి వేడుకలు నిర్వహించనున్నట్లు వెల్లడించారు.క్యూ లైన్లు ప్రసాద పంపిణీ తదితర చర్యలు చేపట్టాలని నిర్ణయించారు.అంతేకాకుండా జనవరి 27వ తేదీ అర్ధరాత్రి నుంచి అసరవల్లిలో పూజా కార్యక్రమాలు మొదలవనున్నాయి.
ప్రశాంత వాతావరణంలో వేడుకలు నిర్వహించుటకు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయని వెల్లడించారు.

మెడికల్ క్యాంపులు ఏర్పాటు, నిరంతరం విద్యుత్ అందించే చర్యలు చేపట్టాలని అలాగే ముందస్తు జనరేటర్లు అందుబాటులో ఉంచాలని వెల్లడించారు.అంతేకాకుండా పుష్కరిణి పరిసరాల్లో లైటింగ్ ఏర్పాటుపై ప్రత్యేక దృష్టి సారించాలని వెల్లడించారు.రథసప్తమి రోజు సమంత్రక స్నానం చేయాలని చెబుతూ ఉంటారు.
లేకపోతే అది కాకి స్నానం అంటారు.కేవలం జిల్లేడు ఆకు, రేగిపండ్లతో మంత్రం పఠిస్తూ మాత్రమే స్నానం చేయడం మంచిది.
దీనివల్ల ఏడు జన్మల పాపాలు తొలగిపోతాయని పండితులు చెబుతున్నారు.అంతేకాకుండా కోరికలు నెరవేరుతాయి అని కూడా చెబుతున్నారు.