టాలీవుడ్ సినీనటి గ్లామర్ బ్యూటీ పూజా హెగ్డే.అలా వైకుంఠపురంలో సినిమా తో బుట్ట బొమ్మ గా బాగా క్రేజ్ ని సంపాదించుకుంది.అంతేకాకుండా టాలీవుడ్ సినీ పరిశ్రమలో స్టార్ స్థానంలో నిలిచింది.ఇక ఈ ముద్దుగుమ్మ హీరోయిన్ గా ఎన్నో సినిమాలలో నటించింది.పలు సినిమాలలో స్పెషల్ సాంగ్ లో కూడా చేసింది.ఇక మహర్షి, రంగస్థలం, గద్దల కొండ గణేష్, అరవింద సమేత వంటి సినిమాలలో నటించి మంచి విజయాన్ని అందుకుంది పూజ.
అంతే కాకుండా ఎంతోమంది దర్శకనిర్మాతలు కూడా పూజా హెగ్డే ఏ సినిమాల్లో అడుగు పెట్టిన అది ఓ సెంటిమెంట్ గా తీసుకుంటున్నారట.ఇక పూజా హెగ్డే ప్రస్తుతం ఆచార్య సినిమాలో బిజీగా ఉంది.
ఇందులో రామ్ చరణ్ సరసన పూజా హెగ్డే హీరోయిన్ గా నటిస్తుంది.ఇటీవలే ఈ సినిమా షూటింగ్ మారేడు మిల్లి అటవీ ప్రాంతంలో జరుగగా అక్కడ పూజా హెగ్డే కూడా పాల్గొంది.
ఈ సినిమా తర్వాత పూజకు రాధేశ్యామ్ సినిమాలో అవకాశాలు రాగా వదులుకుంది.ఇదిలా ఉంటే పూజ కారవాన్ లో అలాంటి పనులను గుట్టుగా వీడియో తీసి అందరినీ ఆశ్చర్యపరిచింది.
తాజాగా పూజ తన కారవాన్ లో జరుగుతున్న ఓ ఫన్నీ సంఘటన గురించి చెబుతూ వీడియోను అభిమానులతో పంచుకుంది.అందులో తన సోదరుడు రిషబ్ హెగ్డే ఏదో సలహా ఇస్తుండటంతో, ఆర్దోపిడీషియన్ ఫ్రీ గా సలహాలు ఇస్తున్నాడంటూ తెలిపింది.
ఇక తన తమ్ముడు కొన్ని సలహాలు, ఎక్సర్ సైజ్ ఎలా చేయాలో వంటి విషయాలు తెలుపుతున్నాడని చెప్పుకొచ్చింది పూజా హెగ్డే.ఈమధ్య పూజ హెగ్డే సోదరుడు డాక్టర్ పట్టాను అందుకున్నారు.